రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా మెప్పించి.. ఆయన మీద అంచనాలు పెంచుకునేలా చేసింది. స్వయంగా జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నాడంటే.. ఆయన స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ అంచనాలను అందుకునేలా తన కొత్త చిత్రం ‘వారణాసి’ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే.. రాజమౌళి మరో అద్భుతమైన విజువల్ వండర్ను ఆవిష్కరించబోతున్నాడని అర్థమైంది. ఈ చిత్రాన్ని 2027 వేసవికి రిలీజ్ చేస్తామని ఆ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే రాజమౌళి ఎప్పుడూ చెప్పిన సమయానికి తన చిత్రాలను రిలీజ్ చేయడనే పేరుంది. ఆలస్యం అనివార్యం అవుతుంటుంది. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేసినట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 7 ఆ డేట్ అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం. తాజాగా వారణాసిలో వెలసిన పోస్టర్లు ఈ దిశగా సంకేతాలు ఇస్తున్నాయి.
In Theatres, 7 April 2027 అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రెడీ చేసి నగర వ్యాప్తంగా పెట్టారు. అంతకుమించి వివరాలు ఏమీ లేవు. ఐతే ఆ పోస్టర్ల డిజైనింగ్ చూస్తే ‘వారణాసి’ని గుర్తుకు తెచ్చేలాగే ఉన్నాయి. ఇది ‘వారణాసి’కి సంబంధించిన పోస్టర్లే అని.. అందుకే వారణాసిలో వీటిని పెట్టించారని.. ఇది కూడా రాజమౌళి మార్కు ప్రమోషనే అని అంటున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.
This post was last modified on January 29, 2026 4:26 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…