వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఈ వ్యవహారంపై ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన పిడుగురాళ్ల పట్టణంలోని మెయిన్ రోడ్డులో ‘మహాపాపం నిజం’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించారని, ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు.
రూ.251 కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిడుగురాళ్లతోపాటు వినుకొండలో కూడా ఇదే తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
This post was last modified on January 29, 2026 6:53 pm
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…
ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…
సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…
ఇవాళ స్ట్రెయిట్, డబ్బింగ్ అన్ని భాషలు కలిపి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి. కానీ థియేటర్ల దగ్గర కోరుకున్న స్థాయిలో జోష్…
సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా…
ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…