వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఈ వ్యవహారంపై ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన పిడుగురాళ్ల పట్టణంలోని మెయిన్ రోడ్డులో ‘మహాపాపం నిజం’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించారని, ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు.
రూ.251 కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిడుగురాళ్లతోపాటు వినుకొండలో కూడా ఇదే తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని… చాలా రోజుల తర్వాత తన సొంతూరు…