వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఈ వ్యవహారంపై ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన పిడుగురాళ్ల పట్టణంలోని మెయిన్ రోడ్డులో ‘మహాపాపం నిజం’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించారని, ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు.
రూ.251 కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిడుగురాళ్లతోపాటు వినుకొండలో కూడా ఇదే తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…