వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఈ వ్యవహారంపై ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన పిడుగురాళ్ల పట్టణంలోని మెయిన్ రోడ్డులో ‘మహాపాపం నిజం’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించారని, ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు.
రూ.251 కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిడుగురాళ్లతోపాటు వినుకొండలో కూడా ఇదే తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
This post was last modified on January 29, 2026 6:53 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…