వరస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా రూటు మార్చి పీరియాడిక్ సెటప్స్ వైపు వెళ్ళిపోతున్నాడు. వాటిలో ముందుగా వస్తున్నది రణబాలి. తనతో టాక్సీవాలా, నానితో శ్యామ్ సింగ రాయ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈసారి పెద్ద బాధ్యతను తీసుకున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్, టి సిరీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 11 విడుదల కానుంది. అంటే రౌడీ జనార్ధనకు నాలుగు నెలల ముందన్న మాట. ఇవాళ కాన్సెప్ట్ పరిచయం చేసే టీజర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసి అభిమానులకు కానుకగా ఇచ్చారు.
1878. స్వాతంత్రం రాకముందు దేశంలో బ్రిటిషర్ల అరాచకం పెట్రేగిపోయింది. లక్షల కోట్ల విలువైన సంపద హద్దులు దాటేసింది. లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక మేజర్ చేసిన అకృత్యాల వల్ల ఒక ప్రాంతం మొత్తం వల్లకాడయ్యే పరిస్థితి తలెత్తింది.
సహాయం కోసం నోరు కూడా తెరవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఎందరో భారతీయులకు అండగా నిలబడేందుకు ఒక యువకుడు తెగించాడు. అతనే రణబాలి. బ్రిటిష్ సైనికుడిని గుర్రం వెనుక కట్టుకుని రైల్వేట్రాక్ మీద పరుగులు పెట్టే సాహసం ఇతని సొంతం. మరి ఈ మరణహోమాన్ని అతను ఎలా ఆపాడనేది తెరమీద చూసి తెలుసుకోవాలి.
విజువల్స్ ని ఎక్కువ రివీల్ చేయకపోయినా యానిమేషన్ రూపంలో కాన్సెప్ట్ ని చక్కగా వివరించారు. అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్ ఇవ్వగా చివరి షాట్లో విజయ్ దేవరకొండ ఇంట్రో అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా సాగింది.
బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ కనక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన ఆర్టిస్టులను చూపించలేదు. రిలీజ్ డేట్ నాన్చకుండా ముందే చెప్పేయడంతో ఎప్పుడు వస్తుందనే సస్పెన్స్ ఉండదు. అంచనాలు రేపడంలో టీమ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. విజయ్ దేవరకొండకు లైఫ్ టైం రోల్ లా అనిపిస్తోంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…