ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరో. సినిమాల బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు, పారితోషకాలు.. ఇలా ఏది చూసుకున్నా చిరు తరచుగా రికార్డులు కొల్లగొట్టేవారు. వేరే స్టార్ల హిట్ సినిమాలకు సమానంగా చిరు ఫ్లాప్ చిత్రాల వసూళ్లు ఉండేవి. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే కొత్త రికార్డులు నమోదు కావాల్సిందే అన్నట్లుండేది.
కానీ చిరు మధ్యలో పదేళ్ల బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేసరికి వేరే స్టార్లు చాలామంది ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల మార్కెట్ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. అయినా సరే రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకుని తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు మెగాస్టార్.
కానీ ఆ తర్వాత మాత్రం చిరు కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో ఈ తరం ప్రేక్షకుల్లో చాలామంది చిరు గురించి తేలిగ్గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆచార్య, భోళా శంకర్ లాంటి సినిమాల ఫలితాలు యాంటీ ఫ్యాన్స్కు పెద్ద ఆయుధాలను ఇచ్చాయి.
కానీ చిరు అసలు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రుజువు చేస్తోంది. అనిల్ రావిపూడి లాంటి ఫ్యామిలీస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తోడవడంతో చిరు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నారు. ఆరంభం నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది.
రిలీజైన నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ నెలకొల్పిన రికార్డును చిరు చిత్రం బద్దలు కొట్టడం విశేషం. తాజాగా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏడో రోజు ఏపీ, తెలంగాణల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నెలకొల్పిన రికార్డును ‘మన శంకర వరప్రసాద్ అధిగమించింది.
బన్నీ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.6 కోట్లు కొల్లగొడితే.. చిరు చిత్రం రూ.9.5 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవరాల్ వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా ఉన్నాయి.
This post was last modified on January 19, 2026 9:39 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…