ఒకప్పుడు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరో. సినిమాల బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లు, పారితోషకాలు.. ఇలా ఏది చూసుకున్నా చిరు తరచుగా రికార్డులు కొల్లగొట్టేవారు. వేరే స్టార్ల హిట్ సినిమాలకు సమానంగా చిరు ఫ్లాప్ చిత్రాల వసూళ్లు ఉండేవి. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే కొత్త రికార్డులు నమోదు కావాల్సిందే అన్నట్లుండేది.
కానీ చిరు మధ్యలో పదేళ్ల బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేసరికి వేరే స్టార్లు చాలామంది ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల మార్కెట్ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. అయినా సరే రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో భారీ విజయాన్నందుకుని తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు మెగాస్టార్.
కానీ ఆ తర్వాత మాత్రం చిరు కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో ఈ తరం ప్రేక్షకుల్లో చాలామంది చిరు గురించి తేలిగ్గా మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆచార్య, భోళా శంకర్ లాంటి సినిమాల ఫలితాలు యాంటీ ఫ్యాన్స్కు పెద్ద ఆయుధాలను ఇచ్చాయి.
కానీ చిరు అసలు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ‘మన శంకర వరప్రసాద్ గారు’ రుజువు చేస్తోంది. అనిల్ రావిపూడి లాంటి ఫ్యామిలీస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తోడవడంతో చిరు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నారు. ఆరంభం నుంచి ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది.
రిలీజైన నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ నెలకొల్పిన రికార్డును చిరు చిత్రం బద్దలు కొట్టడం విశేషం. తాజాగా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏడో రోజు ఏపీ, తెలంగాణల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నెలకొల్పిన రికార్డును ‘మన శంకర వరప్రసాద్ అధిగమించింది.
బన్నీ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.6 కోట్లు కొల్లగొడితే.. చిరు చిత్రం రూ.9.5 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవరాల్ వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా ఉన్నాయి.
This post was last modified on January 19, 2026 9:39 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…