మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం రుజువు చేస్తోంది. చిరు చివరి చిత్రం ‘భోళా శంకర్’ పెద్ద డిజాస్టర్ అయ్యేసరికి ఆయన పనైపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. చిరు బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలియని ఈ తరం కుర్రాళ్లు వెటకారాలు ఆడడం మొదలుపెట్టారు.
కానీ ఆయనకు నప్పే క్యారెక్టర్ పడితే ఎలా చెడుగుడు ఆడుకుంటాడో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తే అర్థమవుతుంది. అనిల్ రావిపూడికి ఫ్యామిలీస్లో ఉన్న ఫాలోయింగ్కు చిరు స్టార్ పవర్ తోడవడంతో ఈ సినిమా పెద్ద మాస్ సినిమా తరహాలో థియేటర్లను నింపేస్తోంది. మంగళవారం రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, బుధవారం ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు రిలీజైనా సరే.. చిరు సినిమాకు టికెట్లు దొరకడం కష్టమైన పరిస్థితి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7-8 మధ్య చిరు చిత్రానికి షోలు నడిపిస్తున్నారు. అలాగే రాత్రి 1 తర్వాత కూడా షోలు పడుతున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’కు ఆ స్థాయిలో డిమాండ్ ఉంది. ఇంకో విశేషం ఏంటంటే.. చిరు సినిమాకు ఉన్న డిమాండ్ వేరే చిత్రాలకు కూడా కలిసొస్తోంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూద్దామని వచ్చి టికెట్లు దొరక్కపోవడంతో చేసేది లేక వేరే సినిమాలకు వెళ్తున్నారు ఆడియన్స్.
చిరు సినిమా ఓవర్ ఫ్లోస్ వేరే చిత్రాలకు కలిసి రావడం దశాబ్దాలుగా జరుగుతున్న విషయమే. ఇలా ఎన్నో సినిమాలు ప్రయోజనం పొందాయి. ఇలాంటి పండుగ సీజన్లలో చిరు సినిమా ఉన్నా వేరే చిత్రాలు పోటీకి వెళ్లడానికి ఓవర్ ఫ్లోస్ కలిసి రావడం కూడా ఒక కారణమే. ఇలా పదుల సంఖ్యలో సినిమాలు లాభం పొంది ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలన్నింటికీ చిరు మూవీ ఓవర్ ఫ్లోస్ కలిసి వస్తున్నాయి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…