గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ – దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్ అయ్యింది. ఈ మేరకు చిన్న యానిమేషన్ వీడియో రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఉదయం నుంచి ఐకాన్ స్టార్ అభిమానులను తెగ ఊరిస్తూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఎట్టకేలకు వాళ్ళు కోరుకున్న శుభవార్త చెప్పేశారు.
గత ఏడాది కూలి ఆశించిన ఫలితం ఇవ్వకపోయిన తర్వాత లోకేష్ ఎవరితో చేతులు కలుపుతాడనే దాని మీద రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ అనూహ్యంగా బన్నీ పేరు తెరమీదకు రావడంతో అంచనాలు, క్యాలికులేషన్లు మారిపోయాయి.
ఇక వీడియో విషయానికి వస్తే అందులో విజువల్స్ గమనిస్తే ఇదేదో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే మూవీగా కనిపిస్తోంది. అడవులు, జంతువులు, ఎత్తయిన కొండ మీద గుర్రం ఎక్కి బన్నీ దాన్ని అదిలించడం లాంటివి నేపథ్యం ఏంటో చెప్పకనే చెబుతున్నాయి.
జాగ్రత్తగా డీ కోడ్ చేస్తే లోకేష్ ఈసారి నగరాన్ని వదిలి ఖైదీ తరహాలో ఒక డార్క్ వరల్డ్ లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చబోతున్నాడు. స్ట్రైవ్ ఫర్ గ్రేట్ నెస్ అని క్యాప్షన్ పెట్టడం చూస్తే మనుగడ, ఆధిపత్యం కోసం పోరాటమనే మెసేజ్ అంతర్లీనంగా కనిపిస్తోంది.
చెప్పడమైతే 2026 స్టార్ట్ అన్నారు కానీ అది నిజంగా జరుగుతుందా లేదానేది ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న అట్లీ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్న టైం అక్టోబర్ లో గుమ్మడికాయ కొట్టేస్తే వెంటనే లోకేష్ కనగరాజ్ సెట్స్ లో బన్నీ అడుగు పెడతాడు.
వరసగా ఇద్దరు తమిళ దర్శకులతో పని చేయడం బన్నీ కెరీర్ లో ఇదే మొదటిసారి. ఎంత లేదన్నా ఏడాదికి పైగానే టైం పడుతుంది కాబట్టి 2028 రిలీజ్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. పుష్ప నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న బన్నీ రాజీ పడకుండా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ లెక్కన పుష్ప 3 ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…