మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా వేరే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు సాధించేవి.
సినిమా బాలేకున్నా.. చిరంజీవిని రెండున్నర గంటల పాటు చూసిన ఆనందంతో బయటికి వచ్చేవాళ్లు అభిమానులు. కానీ పదేళ్లు సినిమాలకు దూరమై రీఎంట్రీ ఇచ్చాక మొదట్లో చిరు సినిమాలు బాగానే ఆడాయి కానీ.. గత ఐదారేళ్లలోనే చిరు ప్రభావం తగ్గుతూ వస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ మినహా సినిమాలన్నీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా ఆచార్య, భోళా శంకర్ చిత్రాలకు వచ్చిన ఫలితం మెగా ఫ్యాన్స్ను కుదేలు చేశాయి. ఈ చిత్రాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా కరువయ్యాయి. ‘భోళా శంకర్’ అయితే ముందే డిజాస్టర్ అనే ఫీలింగ్ వచ్చేయడంతో మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమా థియేటర్ల వైపు కూడా చూడలేదు. చిరు పెద్ద స్టార్ అయ్యాక ఏ సినిమాకూ అంత ఘోరమైన పరాభవం ఎదురు కాలేదు. దీంతో చిరు పనైపోయిందా అనే చర్చ కూడా జరిగింది.
కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో మళ్లీ చిరు తన మార్కు మాస్ చూపిస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మీద కూడా మధ్యలో సందేహాలు కలిగాయి కానీ.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అంతా మారిపోయింది. సంక్రాంతి పోటీలో ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ అంచనాలను అందుకోకపోవడం.. ఇటీవలే రిలీజ్ చేసిన చిరు హుక్ స్టెప్ మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకురావడం.. ఇలా అన్నీ ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అనుకూలంగా మారాయి.
ఓవర్సీస్లో కొంచెం నెమ్మదిగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మంచి జోరు మీద ఉన్నాయి. సినిమాకు ఇప్పుడు ఫుల్ పాజిటివ్ బజ్ కనిపిస్తుండగా.. ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
మొత్తంగా చూస్తే చిరు మార్కు ‘మెగా మాస్’ను మళ్లీ చూస్తున్నామని అభిమానులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కావాల్సిందల్లా సినిమాకు పాజిటివ్ టాకే. అది వస్తే.. మళ్లీ చిరు బాక్సాఫీస్ విధ్వంసాన్ని చూడొచ్చు.
This post was last modified on January 11, 2026 9:37 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…