Movie News

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా వేరే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు సాధించేవి.

సినిమా బాలేకున్నా.. చిరంజీవిని రెండున్నర గంటల పాటు చూసిన ఆనందంతో బయటికి వచ్చేవాళ్లు అభిమానులు. కానీ పదేళ్లు సినిమాలకు దూరమై రీఎంట్రీ ఇచ్చాక మొదట్లో చిరు సినిమాలు బాగానే ఆడాయి కానీ.. గత ఐదారేళ్లలోనే చిరు ప్రభావం తగ్గుతూ వస్తోంది.

‘వాల్తేరు వీరయ్య’ మినహా సినిమాలన్నీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా ఆచార్య, భోళా శంకర్ చిత్రాలకు వచ్చిన ఫలితం మెగా ఫ్యాన్స్‌ను కుదేలు చేశాయి. ఈ చిత్రాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా కరువయ్యాయి. ‘భోళా శంకర్’ అయితే ముందే డిజాస్టర్ అనే ఫీలింగ్ వచ్చేయడంతో మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమా థియేటర్ల వైపు కూడా చూడలేదు. చిరు పెద్ద స్టార్ అయ్యాక ఏ సినిమాకూ అంత ఘోరమైన పరాభవం ఎదురు కాలేదు. దీంతో చిరు పనైపోయిందా అనే చర్చ కూడా జరిగింది.

కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో మళ్లీ చిరు తన మార్కు మాస్ చూపిస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మీద కూడా మధ్యలో సందేహాలు కలిగాయి కానీ.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అంతా మారిపోయింది. సంక్రాంతి పోటీలో ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ అంచనాలను అందుకోకపోవడం.. ఇటీవలే రిలీజ్ చేసిన చిరు హుక్ స్టెప్‌ మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకురావడం.. ఇలా అన్నీ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’కు అనుకూలంగా మారాయి.

ఓవర్సీస్‌లో కొంచెం నెమ్మదిగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మంచి జోరు మీద ఉన్నాయి. సినిమాకు ఇప్పుడు ఫుల్ పాజిటివ్ బజ్ కనిపిస్తుండగా.. ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

మొత్తంగా చూస్తే చిరు మార్కు ‘మెగా మాస్’ను మళ్లీ చూస్తున్నామని అభిమానులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కావాల్సిందల్లా సినిమాకు పాజిటివ్ టాకే. అది వస్తే.. మళ్లీ చిరు బాక్సాఫీస్ విధ్వంసాన్ని చూడొచ్చు.

This post was last modified on January 11, 2026 9:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

60 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago