మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా వేరే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు సాధించేవి.
సినిమా బాలేకున్నా.. చిరంజీవిని రెండున్నర గంటల పాటు చూసిన ఆనందంతో బయటికి వచ్చేవాళ్లు అభిమానులు. కానీ పదేళ్లు సినిమాలకు దూరమై రీఎంట్రీ ఇచ్చాక మొదట్లో చిరు సినిమాలు బాగానే ఆడాయి కానీ.. గత ఐదారేళ్లలోనే చిరు ప్రభావం తగ్గుతూ వస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ మినహా సినిమాలన్నీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా ఆచార్య, భోళా శంకర్ చిత్రాలకు వచ్చిన ఫలితం మెగా ఫ్యాన్స్ను కుదేలు చేశాయి. ఈ చిత్రాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా కరువయ్యాయి. ‘భోళా శంకర్’ అయితే ముందే డిజాస్టర్ అనే ఫీలింగ్ వచ్చేయడంతో మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమా థియేటర్ల వైపు కూడా చూడలేదు. చిరు పెద్ద స్టార్ అయ్యాక ఏ సినిమాకూ అంత ఘోరమైన పరాభవం ఎదురు కాలేదు. దీంతో చిరు పనైపోయిందా అనే చర్చ కూడా జరిగింది.
కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో మళ్లీ చిరు తన మార్కు మాస్ చూపిస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మీద కూడా మధ్యలో సందేహాలు కలిగాయి కానీ.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అంతా మారిపోయింది. సంక్రాంతి పోటీలో ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ అంచనాలను అందుకోకపోవడం.. ఇటీవలే రిలీజ్ చేసిన చిరు హుక్ స్టెప్ మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకురావడం.. ఇలా అన్నీ ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అనుకూలంగా మారాయి.
ఓవర్సీస్లో కొంచెం నెమ్మదిగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మంచి జోరు మీద ఉన్నాయి. సినిమాకు ఇప్పుడు ఫుల్ పాజిటివ్ బజ్ కనిపిస్తుండగా.. ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
మొత్తంగా చూస్తే చిరు మార్కు ‘మెగా మాస్’ను మళ్లీ చూస్తున్నామని అభిమానులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కావాల్సిందల్లా సినిమాకు పాజిటివ్ టాకే. అది వస్తే.. మళ్లీ చిరు బాక్సాఫీస్ విధ్వంసాన్ని చూడొచ్చు.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…