సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే. కానీ పండగ అయిపోయేదాకా ఫైనల్ స్టేటస్ తేలదు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయలి. ఇప్పుడు అందరి దృష్టి మన శంకరవరప్రసాద్ గారు మీదకు వెళ్తోంది.
చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేస్తున్నారు. తెలంగాణ కొంత ఆలస్యంగా అనౌన్స్ చేసినప్పటికీ చివరి నిమిషం దాకా నాన్చే ఇబ్బంది లేకుండా ఆదివారం ఉదయమే టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టేశారు. ఏపీలో మొన్నే టికెట్ల అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి.
ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మన శంకరవరప్రసాద్ గారుకి బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం శుభ సూచకం. రాత్రికి వచ్చే టాక్ ని బట్టి ఈ నెంబర్లలో గణనీయమైన మార్పు ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, అనిల్ రావిపూడికి బలంగా నిలిచే ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల చాలా ఆసక్తితో ఉన్నారు.
వెంకటేష్ క్యామియో తోడవ్వడంతో హైప్ మరింత పెరిగింది. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్స్ ఛార్ట్ బస్టర్స్ కావడం, మెగా విక్టరీ పాటను ఫ్యాన్స్ బాగా రిసీవ్ చేసుకోవడం బజ్ కి తోడ్పడుతున్నాయి. ఓవర్సీస్ లో దాదాపు మిలియన్ మార్కుకు దగ్గరగా వెళ్తున్న ప్రసాద్ గారు షో టైంకి దాన్ని చేరుకున్నా ఆశ్చర్యం లేదు.
పాజిటివ్ టాక్ వస్తే మటుకు నిజమైన పండగ వాతావరణం థియేటర్లలో చూడొచ్చు. రేపంతా చిరంజీవికి ఓపెన్ గ్రౌండ్ దొరకనుంది. చాలా సెంటర్లలో పెద్ద ఎత్తున థియేటర్లు, షోలు కేటాయిస్తున్నారు. ఆ తర్వాత వచ్చే భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి పోటీని తట్టుకోవాలంటే ప్రసాద్ గారు యునానిమస్ టాక్ తెచ్చుకోవాల్సిందే.
అభిమానులైతే సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. భోళా శంకర్ తర్వాత రెండేళ్లకే పైగా గ్యాప్ తీసుకున్న చిరంజీవికి ఈ సక్సెస్ చాలా కీలకం. హిట్టు కొడితేనే ఇంత కాలం తీసుకున్న గ్యాప్ కు న్యాయం చేసినట్టు అవుతుంది.
This post was last modified on January 11, 2026 10:31 am
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…