Movie News

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ పడుతుంటారు. కానీ కొందరు లిరిసిస్టులు మాత్రం తెలుగు పాట స్ధాయిని కాపాడడానికి తమ వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అందులో ఒకరు చంద్రబోస్.

సిరివెన్నెల మరణించిన సమయంలో.. ఆయన పాటించిన ప్రమాణాలను అనుసరిస్తూ, తెలుగు పాటను నిలబెడతామంటూ ఆయన శపథం కూడా చేశారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలాంటి సినిమాకు పాటలు రాసినా తన ముద్రను చూపిస్తుంటారు చంద్రబోస్.

అగ్ర దర్శకుడు సుకుమార్, ఎంతో అభిమానంతో తన ప్రతి సినిమాకీ బోసుతోనే పాటలు రాయించుకుంటారు. వీరి కలయికలో వచ్చిన చిత్రాల్లో రంగస్థలం చాలా స్పెషల్. దర్శకుడిగా సుకుమార్ ఇందులో ఒక లెవెల్ చూపిస్తే.. సాహిత్యంతో బోస్ కూడా తన స్థాయిని చూపించారు. ఇందులో ప్రతి పాటా ఒక ఆణిముత్యం.

ఇలాంటి గొప్ప పాటల కోసం చంద్రబోస్ అసలు పెన్ను, పేపరే ముట్టుకోలేదట. ఈ విషయాన్ని ఒక పాడ్ కాస్ట్ లో ఆయన వెల్లడించారు. “ఆ సినిమా పాటలు అన్ని కేవలం గంట వ్యవధిలో పూర్తి అయ్యాయి. నేనసలు పెన్ను, పేపరు ముట్టుకోనేలేదు. పాటల లిరిక్స్ అన్ని నోటితోనే చెప్పేశాను. అలాగే రికార్డు అయ్యాయి. ఈ సినిమా నుంచి ఎంత సక్కగున్నావే పాటను రిలీజ్ చేసినపుడు మంచి స్పందన వచ్చాక సోషల్ మీడియాలో లిరిక్ కార్డు పోస్ట్ చెయ్యాల్సి ఉంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు లిరిక్స్ రాసి ఇవ్వమన్నారు. అందుకోసమే పేపర్ మీద రాయాల్సి వచ్చింది. అంతే కానీ అందులో ఏ పాట కోసం కూడా పెన్ను, పేపర్ ముట్టుకోలేదు” అని చంద్రబోస్ వెల్లడించారు.

1995లో తాజ్ మహల్ సినిమాతో గేయ రచయితగా పరిచయం అయిన చంద్రబోస్ ఇప్పటిదాకా 3600 దాకా పాటలు రాశారు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

This post was last modified on January 11, 2026 7:47 am

Share

Recent Posts

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

13 minutes ago

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…

39 minutes ago

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

60 minutes ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

3 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

3 hours ago