వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ పడుతుంటారు. కానీ కొందరు లిరిసిస్టులు మాత్రం తెలుగు పాట స్ధాయిని కాపాడడానికి తమ వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అందులో ఒకరు చంద్రబోస్.
సిరివెన్నెల మరణించిన సమయంలో.. ఆయన పాటించిన ప్రమాణాలను అనుసరిస్తూ, తెలుగు పాటను నిలబెడతామంటూ ఆయన శపథం కూడా చేశారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలాంటి సినిమాకు పాటలు రాసినా తన ముద్రను చూపిస్తుంటారు చంద్రబోస్.
అగ్ర దర్శకుడు సుకుమార్, ఎంతో అభిమానంతో తన ప్రతి సినిమాకీ బోసుతోనే పాటలు రాయించుకుంటారు. వీరి కలయికలో వచ్చిన చిత్రాల్లో రంగస్థలం చాలా స్పెషల్. దర్శకుడిగా సుకుమార్ ఇందులో ఒక లెవెల్ చూపిస్తే.. సాహిత్యంతో బోస్ కూడా తన స్థాయిని చూపించారు. ఇందులో ప్రతి పాటా ఒక ఆణిముత్యం.
ఇలాంటి గొప్ప పాటల కోసం చంద్రబోస్ అసలు పెన్ను, పేపరే ముట్టుకోలేదట. ఈ విషయాన్ని ఒక పాడ్ కాస్ట్ లో ఆయన వెల్లడించారు. “ఆ సినిమా పాటలు అన్ని కేవలం గంట వ్యవధిలో పూర్తి అయ్యాయి. నేనసలు పెన్ను, పేపరు ముట్టుకోనేలేదు. పాటల లిరిక్స్ అన్ని నోటితోనే చెప్పేశాను. అలాగే రికార్డు అయ్యాయి. ఈ సినిమా నుంచి ఎంత సక్కగున్నావే పాటను రిలీజ్ చేసినపుడు మంచి స్పందన వచ్చాక సోషల్ మీడియాలో లిరిక్ కార్డు పోస్ట్ చెయ్యాల్సి ఉంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు లిరిక్స్ రాసి ఇవ్వమన్నారు. అందుకోసమే పేపర్ మీద రాయాల్సి వచ్చింది. అంతే కానీ అందులో ఏ పాట కోసం కూడా పెన్ను, పేపర్ ముట్టుకోలేదు” అని చంద్రబోస్ వెల్లడించారు.
1995లో తాజ్ మహల్ సినిమాతో గేయ రచయితగా పరిచయం అయిన చంద్రబోస్ ఇప్పటిదాకా 3600 దాకా పాటలు రాశారు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 11, 2026 7:47 am
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…