నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మానవత్వానికి వైద్యం చిరునామా అని పేర్కొన్న ఆయన.. నెలలో ఒక్కరోజైనా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు.
పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. కాకినాడ లోని ప్రఖ్యాత రంగరాయ మెడికల్ కాలేజీలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ భవనాన్ని పూర్వ విద్యార్థుల సంఘం ఆర్థిక సాయంతో చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైద్యుల కష్టాలు తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వైద్యులు నెలలో ఒకరోజు పల్లెలు, గిరిజన ప్రాంతాలకు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధులు కనిపిస్తున్నాయని, వాటికి వైద్యం అందించాలని సూచించారు.
నిపుణులైన వైద్యులు నగరాలు, పట్టణాలకే పరిమితం అవుతున్నారని.. కానీ, గ్రామీణులు కూడా ఈ దేశంలో భాగమని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. వైద్యం అందక.. ఎంతో మంది అగచాట్లు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కూడాకృషి చేస్తుందని తెలిపారు.
పూర్వ విద్యార్థులు రంగరాయ కాలేజీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎంతో మంది దాతల సహకారంలో ఏర్పడిన ఈ కాలేజీలో అనేక మంది వైద్య విద్య చదువుకున్నారని తెలిపారు. ఈ కళాశాలకు సేవాగుణం ఉందని పేర్కొన్నారు. వేలాది మంది వైద్యులను ఈ కాలేజీ అందిస్తోందని తెలిపారు.
కుల మతాలకు అతీతంగా సమాజం గురించి ఆలోచించాలని యువతకు పిలుపునిచ్చారు. కొందరు సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని.. దీంతో అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని పరోక్షంగా వైసీపీ పై విమర్శలు గుప్పించారు. అరకు ప్రాంతంలో `సికిల్ సెల్ అనీమియా` బాధితుల కోసం `బ్లడ్ బ్యాంక్`ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
This post was last modified on January 11, 2026 7:54 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…