కమల్ హాసన్, శంకర్ల కాంబినేషన్లో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆ చిత్రం బ్లాక్బస్టర్ కావడమే కాదు.. జనాల ఆలోచనల్ని కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. దీని సీక్వెల్ గురించి తర్వాతి కాలంలో అనేకసార్లు చర్చ జరిగింది. చివరికి ‘భారతీయుడు’ వచ్చిన 20 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్ను మొదలుపెట్టి ఈ సినిమాను అభిమానించేవారిని అమితానందంలో ముంచెత్తాడు శంకర్.
ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో కానీ.. నాటి నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పట్లేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. చివరగా సెట్స్లో జరిగిన ప్రమాదం వల్ల బ్రేక్ పడగా.. ఆ తర్వాత కరోనా సినిమాకు అడ్డం పడింది. ఐతే కరోనా అనంతరం అందరూ షూటింగ్ మొదలుపెట్టినా ఈ సినిమా మాత్రం ముందుకు కదల్లేదు.
దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య బడ్జెట్, ఇతర విషయాల్లో విభేదాలే ‘ఇండియన్-2’ ముందుకు కదలకపోవడానికి కారణం. ఐతే ఎట్టకేలకు వారి మధ్య విభేదాలు తొలగిపోయాయటయ. వారి మధ్య విభేదాలు తొలగిపోయాయట. సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారట. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం అవుతుందని సమాచారం.
ఇంకా ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలనుకున్నారు కానీ.. ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోయేసరికి కమల్ ఈ మధ్యనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి జనవరి నెలాఖరులో ఆయన అందుబాటులోకి వస్తారని ‘ఇండియన్-2’ బృందం ఆశిస్తోంది. ఒక దశలో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. అవి తొలగిపోయి ఈ మెగా మూవీ ముందుకు కదలబోతుండటం కమల్, శంకర్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది.
This post was last modified on December 11, 2020 3:28 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…