కమల్ హాసన్, శంకర్ల కాంబినేషన్లో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆ చిత్రం బ్లాక్బస్టర్ కావడమే కాదు.. జనాల ఆలోచనల్ని కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. దీని సీక్వెల్ గురించి తర్వాతి కాలంలో అనేకసార్లు చర్చ జరిగింది. చివరికి ‘భారతీయుడు’ వచ్చిన 20 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్ను మొదలుపెట్టి ఈ సినిమాను అభిమానించేవారిని అమితానందంలో ముంచెత్తాడు శంకర్.
ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో కానీ.. నాటి నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పట్లేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. చివరగా సెట్స్లో జరిగిన ప్రమాదం వల్ల బ్రేక్ పడగా.. ఆ తర్వాత కరోనా సినిమాకు అడ్డం పడింది. ఐతే కరోనా అనంతరం అందరూ షూటింగ్ మొదలుపెట్టినా ఈ సినిమా మాత్రం ముందుకు కదల్లేదు.
దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య బడ్జెట్, ఇతర విషయాల్లో విభేదాలే ‘ఇండియన్-2’ ముందుకు కదలకపోవడానికి కారణం. ఐతే ఎట్టకేలకు వారి మధ్య విభేదాలు తొలగిపోయాయటయ. వారి మధ్య విభేదాలు తొలగిపోయాయట. సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారట. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం అవుతుందని సమాచారం.
ఇంకా ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలనుకున్నారు కానీ.. ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోయేసరికి కమల్ ఈ మధ్యనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి జనవరి నెలాఖరులో ఆయన అందుబాటులోకి వస్తారని ‘ఇండియన్-2’ బృందం ఆశిస్తోంది. ఒక దశలో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. అవి తొలగిపోయి ఈ మెగా మూవీ ముందుకు కదలబోతుండటం కమల్, శంకర్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది.
This post was last modified on December 11, 2020 3:28 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…