కమల్ హాసన్, శంకర్ల కాంబినేషన్లో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆ చిత్రం బ్లాక్బస్టర్ కావడమే కాదు.. జనాల ఆలోచనల్ని కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. దీని సీక్వెల్ గురించి తర్వాతి కాలంలో అనేకసార్లు చర్చ జరిగింది. చివరికి ‘భారతీయుడు’ వచ్చిన 20 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్ను మొదలుపెట్టి ఈ సినిమాను అభిమానించేవారిని అమితానందంలో ముంచెత్తాడు శంకర్.
ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో కానీ.. నాటి నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పట్లేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. చివరగా సెట్స్లో జరిగిన ప్రమాదం వల్ల బ్రేక్ పడగా.. ఆ తర్వాత కరోనా సినిమాకు అడ్డం పడింది. ఐతే కరోనా అనంతరం అందరూ షూటింగ్ మొదలుపెట్టినా ఈ సినిమా మాత్రం ముందుకు కదల్లేదు.
దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య బడ్జెట్, ఇతర విషయాల్లో విభేదాలే ‘ఇండియన్-2’ ముందుకు కదలకపోవడానికి కారణం. ఐతే ఎట్టకేలకు వారి మధ్య విభేదాలు తొలగిపోయాయటయ. వారి మధ్య విభేదాలు తొలగిపోయాయట. సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారట. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం అవుతుందని సమాచారం.
ఇంకా ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలనుకున్నారు కానీ.. ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోయేసరికి కమల్ ఈ మధ్యనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి జనవరి నెలాఖరులో ఆయన అందుబాటులోకి వస్తారని ‘ఇండియన్-2’ బృందం ఆశిస్తోంది. ఒక దశలో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న సందేహాలు కలిగాయి. అవి తొలగిపోయి ఈ మెగా మూవీ ముందుకు కదలబోతుండటం కమల్, శంకర్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…