మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా బుక్ మై షో క్రాష్ అయ్యింది. కల్కి పబ్లిసిటీ మీద నాగ అశ్విన్ దృష్టి పెట్టకపోయినా ఓపెనింగ్ రికార్డులు బద్దలైపోయాయి. కేవలం ప్రభాస్ ఇమేజ్ మీద రాధే శ్యామ్ బాలీవుడ్ లో వర్కౌట్ చేసుకుంది. కానీ రాజా సాబ్ విషయంలో ఇలాంటి మేజిక్ ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కారణం రెండు టీజర్లు, రెండు పాటలు ఆశించిన స్థాయిలో హైప్ పెంచకపోవడమే. ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంది కానీ దాని తాలూకు మేజిక్ ఆన్ లైన్, అఫ్ లైన్ రెండింటిలోనూ కనిపించాలి.
ఇది ఆషామాషీ ప్యాన్ ఇండియా మూవీ కాదు. నాలుగు వందల కోట్ల దాకా బడ్జెట్ అయ్యింది. సోలోగా అయితే ఈ డిస్కషన్ ఉండేది కాదు. కానీ అవతల కాంపిటీషన్ లో అరడజను సినిమాలున్నాయి. ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎంత ప్రభాస్ అయినా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా రాజా సాబ్ చూడరుగా. ఆప్షన్లు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాధాన్యతలు మారిపోతాయి. టాకులు, రివ్యూలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. పండగ సీజన్లో హీరో ఇమేజ్ ని బట్టి కాకుండా ఏది బాగుందనే మాటలను బట్టి వసూళ్లు మారిపోతాయి. అందులోనూ టికెట్ రేట్లు పెంచుకునే ట్రెండ్ లో కాంపిటీషన్ పెద్ద పాములా మారిపోయింది.
సో నెక్స్ట్ రాజా సాబ్ నుంచి వచ్చే ఏ కంటెంట్ అయినా ఎక్స్ ట్రాడినరిగా ఉండాలి. ఒకవైపు అనిల్ రావిపూడి మన శంకరవరప్రసాద్ గారు పబ్లిసిటీ స్పీడ్ పెంచేశాడు. సింపుల్ గా చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ పెద్దగా వచ్చేలా చేయడం తన స్టయల్. ఇంకోవైపు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ రంగంలోకి దిగుతున్నారు. సో ఇవన్నీ రాజా సాబ్ ని కవ్వించేవే. బాహుబలి నుంచి ప్రభాస్ కు దక్కినవన్నీ సోలో రిలీజులు. మొదటిసారి ఇంత పోటీలో దిగుతున్నాడు. సో భుజాల పై బరువు కొంచెం తగ్గాలంటే తమన్, మారుతీ నుంచి బ్యాన్గర్ అనిపించే మెటీరియల్ రావాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందే ఇస్తారేమో చూడాలి.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…