కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భైరవంలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన మనోజ్.. మిరాయ్లో పూర్తి స్థాయి విలన్గానే నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాక.. మనోజ్కు మంచి పేరూ తెచ్చిపెట్టింది. ఈ ఊపులో మళ్లీ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మంచు హీరో. డేవిడ్ రెడ్డి పేరుతో ఒక పీరియడ్ ఫిలింను కొన్ని నెలల కిందటే మనోజ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజే దాని గ్లింప్స్ రిలీజైంది.
సౌండ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి పేరుతో రిలీజైన ఆ గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి. బ్రిటిష్ కాలంలో భారతీయులు అల్లాడిపోతున్నపుడు.. జలియన్ వాలా బాగ్ ఘటన అనంతరం ఇండియన్స్ గుండెలు మండిపోతున్నపుడు.. 25 కోట్ల మంది కోపాన్ని తన ఒక్కడిలో నింపుకుని.. బ్రిటిష్ వాళ్ల మీద దండెత్తిన యోధుడి కథగా దీన్ని నరేట్ చేశారు.
ఈ గ్లింప్స్ ఆద్యంతం మంచి విజువల్స్, బీజీఎంతో హుషారుగా సాగి సినిమా మీద అంచనాలను పెంచింది. కాకపోతే పీరియడ్ ఫిలిం అన్నారు కానీ.. గ్లింప్స్ చూస్తే మోడర్న్ టచ్ కనిపించింది. మరి సినిమాలో పీరియడ్ టచ్ ఎలా చూపిస్తారో చూడాలి.
ఈ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా మంచు మనోజ్.. డేవిడ్ రెడ్డిలో క్యామియో రోల్స్ గురించి మాట్లాడాడు. ఇందులో మనోజ్ ఫ్రెండయిన తమిళ స్టార్ హీరో శింబు ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే మరో పాత్ర కోసం రామ్ చరణ్ను అడుగుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీని గురించి మనోజ్ను ప్రశ్నిస్తే.. ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్రలు కొన్ని ఉన్న మాట వాస్తవమే అన్నాడు.
ఐతే క్యామియో కోసం రామ్ చరణ్ను ఇంకా తాము అడగలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడే సినిమా మొదలవుతోందని.. గ్లింప్స్ లాంచ్ చేశామని.. ఇందులో నటీనటుల గురించి మాట్లాడడం మరీ తొందర అవుతుందని.. మిగతా విశేషాలు పంచుకోవడం కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాలని అతనన్నాడు. కొత్తవాడైన హనుమరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…