కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భైరవంలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన మనోజ్.. మిరాయ్లో పూర్తి స్థాయి విలన్గానే నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాక.. మనోజ్కు మంచి పేరూ తెచ్చిపెట్టింది. ఈ ఊపులో మళ్లీ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మంచు హీరో. డేవిడ్ రెడ్డి పేరుతో ఒక పీరియడ్ ఫిలింను కొన్ని నెలల కిందటే మనోజ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజే దాని గ్లింప్స్ రిలీజైంది.
సౌండ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి పేరుతో రిలీజైన ఆ గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి. బ్రిటిష్ కాలంలో భారతీయులు అల్లాడిపోతున్నపుడు.. జలియన్ వాలా బాగ్ ఘటన అనంతరం ఇండియన్స్ గుండెలు మండిపోతున్నపుడు.. 25 కోట్ల మంది కోపాన్ని తన ఒక్కడిలో నింపుకుని.. బ్రిటిష్ వాళ్ల మీద దండెత్తిన యోధుడి కథగా దీన్ని నరేట్ చేశారు.
ఈ గ్లింప్స్ ఆద్యంతం మంచి విజువల్స్, బీజీఎంతో హుషారుగా సాగి సినిమా మీద అంచనాలను పెంచింది. కాకపోతే పీరియడ్ ఫిలిం అన్నారు కానీ.. గ్లింప్స్ చూస్తే మోడర్న్ టచ్ కనిపించింది. మరి సినిమాలో పీరియడ్ టచ్ ఎలా చూపిస్తారో చూడాలి.
ఈ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా మంచు మనోజ్.. డేవిడ్ రెడ్డిలో క్యామియో రోల్స్ గురించి మాట్లాడాడు. ఇందులో మనోజ్ ఫ్రెండయిన తమిళ స్టార్ హీరో శింబు ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే మరో పాత్ర కోసం రామ్ చరణ్ను అడుగుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీని గురించి మనోజ్ను ప్రశ్నిస్తే.. ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన పాత్రలు కొన్ని ఉన్న మాట వాస్తవమే అన్నాడు.
ఐతే క్యామియో కోసం రామ్ చరణ్ను ఇంకా తాము అడగలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడే సినిమా మొదలవుతోందని.. గ్లింప్స్ లాంచ్ చేశామని.. ఇందులో నటీనటుల గురించి మాట్లాడడం మరీ తొందర అవుతుందని.. మిగతా విశేషాలు పంచుకోవడం కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాలని అతనన్నాడు. కొత్తవాడైన హనుమరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on December 18, 2025 9:09 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…