Movie News

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు మానగరం తీసి ప్రశంసలు అందుకున్నప్పటికీ అతని రియల్ స్టామినా బయట పెట్టింది మాత్రం కార్తినే. ఆ తర్వాత విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్లు పిలిచి మరీ అవకాశాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. వాటిలో ఒక్క కూలి మాత్రమే అంచనాలు అందుకోలేక యావరేజ్ అయ్యింది. అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఖైదీ 2ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నిజానికి సీక్వెల్ కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది. జైలుకు రాకముందు ఢిల్లీ ఏం చేసేవాడనే క్యూరియాసిటీ అభిమానుల్లో ఎక్కువగా ఉంది.

కానీ లోకేష్ కనగరాజ్ నుంచి ఖైదీ 2కి సంబంధించి ఎలాంటి కదలిక లేదు. ఒకపక్క కమల్ రజని మల్టీస్టారర్ చేజారిపోయింది. అమీర్ ఖాన్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తెలుగులో ప్రభాస్ లాంటి స్టార్లను ట్రై చేస్తున్నా వెంటనే గ్రీన్ సిగ్నల్ దొరకడం లేదు. ఇటు కార్తీ ఖైదీ 2 చేయడానికి సిద్ధంగా ఉన్నా లోకేష్ వైపు నుంచి రెస్పాన్స్ లేదు. అన్నగారు వస్తారు ప్రమోషన్లలో భాగంగా ఎదురైన ప్రశ్నకు సమాధానం చెబుతూ నాకు తెలియదు, నాకు తెలియని అప్డేట్ ఖైదీ 2నే అని కార్తీ చెప్పడం చూస్తే ఈ ప్రాజెక్టు ఎప్పటికీ రాదేమోనని ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు.

లోకేష్ చేతిలో ఖైదీ 2 ఒకటే కాదు. చాలా కథలున్నాయి. రోలెక్స్, విక్రమ్ 2 కూడా రెడీ చేసి పెట్టుకుంటానని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆ మాట నిజం కాలేదు. నిజానికి ఇప్పుడు తనున్న సిచువేషన్ లో ఖైదీ 2తో కంబ్యాక్ అయితే ఓ రేంజ్ లో కిక్ ఉంటుంది. తనకు బ్రేక్ ఇచ్చిన హీరో కార్తీ అని, ఖచ్చితంగా తనను వదిలే సమస్య లేదని కూలి ప్రమోషన్లలో చెప్పుకున్న లోకేష్ ఇప్పుడా ప్రస్తావన ఎందుకు తేవడం లేదో అంతు చిక్కడం లేదు. సరే ఖైదీ 2 తీయకపోయినా పర్లేదు కానీ అదేదో డైరెక్ట్ గా చెప్పేస్తే ఆలోచించడం మానేస్తాం అంటున్నారు ఫ్యాన్స్. కానీ లోకేష్ మాత్రం అంత ఈజీగా తేల్చేలా లేడు.

This post was last modified on December 10, 2025 10:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

6 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

7 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

8 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

8 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

11 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

12 hours ago