అయిన కాడికీ.. కాని కాడికీ.. రాజకీయాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. ఇప్పటికే గత ఎన్నికల్లో చావు దెబ్బ తిని.. 11 స్థానాలకు పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి.. అలో లక్ష్మణా అంటూ.. ప్రతిపక్ష హోదా కోసం..కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చుకున్నా.. ఇంకా మార్పు అయితే.. కనిపించడం లేదు. 2024 ఎన్నికలకు ముందు ఎలా అయితే.. ఆ పార్టీ నాయకులు బిహేవ్ చేశారో.. అలానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ప్రజల ఓటు బ్యాంకు కేవలం సంక్షేమంతోను.. ప్రభుత్వాలు ఇచ్చే నగదుతోను.. ముడి పడి లేదన్న విషయాన్ని ఏపీ ప్రజలు రెండు సార్లు నిరూపించారు. ఇదే నిజమైతే.. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు.. పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు రూ.10 వేల చొప్పు బ్యాంకుల్లో వేశారు. కానీ, ఆయన గెలిచారా? లేదే..!. ఇక, 2019-24 వరకు తాను 2.5 లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కి బ్యాంకుల్లోవేశానని చెప్పిన జగన్ను మాత్రం కరుణించారా? లేదే!!.
దీనికి కారణం.. ప్రజల సెంటిమెంటుతో ముడిపడిన వ్యవహారాలే!. ఈ విషయాన్ని వైసీపీ గాలికి వదిలేసింది. 2019 ముందు.. జగన్ చేసిన పాదయాత్ర సెంటిమెంటును రగిల్చితే.. 2024లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను తీవ్రంగా అవమానించడం.. మూడు పెళ్లిళ్లు అంటూ.. వికృత ప్రచారం చేయడం.. కాపులను అవమానించే(టీడీపీని భుజాన మోస్తున్నారంటూ) వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీపైనా.. పవన్ పైనా సెంటిమెంటు ఏర్పడి.. కూటమికి జై కొట్టారు.
ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ మళ్లీ అవే తప్పులు చేస్తోంది. పవన్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది. ఇటీవల కర్ణాటకలో పర్యటించిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు.. దీనికి ముందు పీటీఎం కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన భేటీ అయిన విషయాన్ని గుది గుచ్చి వికృత ప్రచారం చేసి ఆనందిస్తోంది. కానీ, ఇది ఆ పార్టీకి ఆనందంగా ఉండొచ్చు. అయితే.. పవన్ను అభిమానించేవారు.. ముఖ్యంగా కాపులకు మద్దతుగా నిలిచేవారిలో ఆగ్రహాన్ని కల్పిస్తోంది. సో.. దీంతో వైసీపీ ప్రత్యేకంగా బావుకునేది ఏమీ లేకపోగా.. ఇంకా ఆ పార్టీ డైల్యూట్ అవుతుందన్న విషయాన్ని మరిచిపోవడం గమనార్హం.
This post was last modified on December 11, 2025 8:08 am
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…