ఎల్లుండి విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య టయర్ 2 హీరోల సినిమాలకు కూడా టికెట్ రేట్ల హైక్స్ అడగడం మాములు విషయమైపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రకింగ్ తాలూకాకు కూడా పెంపులు తెస్తారేమోననే అనుమానం ఫ్యాన్స్ లో లేకపోలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెగ్యులర్ ధరలతోనే టికెట్ రేట్లు ఉండొచ్చట. తెలంగాణలో ఎలాగూ గరిష్ట పరిమితి తగినంత ఉంది కాబట్టి అక్కడేం టెన్షన్ లేదు కానీ మిరాయ్ లాగా హిట్ టాక్ వస్తే ఏపీలోనూ లాభాలు చూడొచ్చు.
రామ్ ఈ సినిమా ప్రమోషన్ల కోసం చాలా తిరుగుతున్నాడు. ఇక్కడి ఈవెంట్లన్నీ చూసుకుని యుఎస్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి ఎన్ఆర్ఐలతో కలిసి ప్రీమియర్లు చూడబోతున్నాడు. రిలీజ్ టైంలో ఇక్కడ ఉండకుండా అమెరికాలో పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవడం చూస్తే ఈసారి యుఎస్ మార్కెట్ గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. నాని, తేజ సజ్జ లాంటి వాళ్ళు ఈ స్ట్రాటజీతోనే వర్కౌట్ చేసుకున్నారు. అందుకే రామ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు కాబోలు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా రామ్ తో పాటు వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో భాగం పంచుకుంటోంది. ఓపెనింగ్స్ మీద అక్కడి బయ్యర్లు ధీమాగా ఉన్నారు.
ఈ మధ్య ట్రెండ్ గమనిస్తుంటే టికెట్ రేట్ల ప్రభావం ఆడియన్స్ మీద బలంగానే ఉంది. రాజు వెడ్స్ రాంబాయికి మొదటి రోజు 99 రూపాయలు పెట్టడం టాక్ పరంగా ఎంత పెద్ద మేలు చేసిందో చూశాం. ప్యాన్ ఇండియా బడ్జెట్ పెట్టినా సరే మిరాయ్ కు పెంపుకు వెళ్ళకపోవడం చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఆంధ్రకింగ్ తాలూకా ఇదే రూటులో వెళ్లడం ఖచ్చితంగా మేలు చేస్తుంది కాకపోతే నిజంగా పెంపుకు వెళ్లరా లేదానేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అసలే బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి లేదు. ఇప్పుడు కనక ఆంధ్రకింగ్ తాలూకా కనక బాగుందనే మాట తెచ్చుకుంటే అఖండ 2 వచ్చాక కూడా హోల్డ్ కొనసాగించవచ్చు.
This post was last modified on November 25, 2025 5:38 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…