Political News

పులివెందులలో ప్రజాదర్బార్… జగన్ ప్లాన్ ఏంటి?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ నేటి నుంచి మూడు రోజులు పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మూడు రోజుల షెడ్యూల్ విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజలతో మమేకం కానున్నారు. అదే సమయంలో క్యాడర్ పైన ఆయన ఫోకస్ పెడతారు అని భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

రేపు బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.

కొద్ది నెలల కిందట జరిగిన జడ్పిటిసి బై ఎలక్షన్స్ లో పులివెందుల నియోజకవర్గం లో వైసీపీ కనీసం తమ పార్టీ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. జగన్ కు కంచుకోట అని భావించే పులివెందులలో ఘోర పరాజయాన్ని ఎదురుచూసింది. దశాబ్దాలుగా వారి కుటుంబంతో ప్రయాణిస్తున్న కార్యకర్తలు కూడా జడ్పిటిసి ఒక ఎన్నికల సందర్భంగా వెనకడుగు వేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వైసిపి ఆరోపించినా.. కనీసం ఏజెంట్ లను కూడా నిలబెట్టుకోలేకపోవడం ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అర్థం పడుతుంది. ఈ క్రమంలో ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా కేడర్ తో సమావేశం అవుతారా..? వారికి దిశానిర్దేశం చేస్తారా..? కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతారా..? అనేది చూడాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయన కార్యకర్తలతో, స్థానిక నేతలతో సమావేశం అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

This post was last modified on November 25, 2025 2:19 pm

Share

Recent Posts

తొమ్మిది డ్రాఫ్టులు… మూడు క్లైమాక్స్‌లు

మొదట నటుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి.. తర్వాత దర్శకుడిగా మారుతుంటే తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని…

2 hours ago

రామాయణ ట్రైలర్… వర్త్ ఉందా వర్మా

నాలుగు వేల కోట్లతో తీశామని గతంలో రామాయణ గురించి గర్వంగా చెప్పుకున్న నిర్మాత నమిత్ మల్హోత్రా తర్వాత ఆ మాట…

3 hours ago

డిజాస్టర్ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌ను దాటేస్తున్నాడు

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించిన హీరో రావడం అసాధ్యం అనుకున్నారంతా. ఒకప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఆ…

9 hours ago

దేశముదురు చేయకపోవడమే మంచిదైంది

ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…

12 hours ago

ఒకటవ తేదీకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…

13 hours ago

ఆదర్శ కుటుంబానికి తమన్ ఎలివేషన్

త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…

15 hours ago