Political News

పులివెందులలో ప్రజాదర్బార్… జగన్ ప్లాన్ ఏంటి?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ నేటి నుంచి మూడు రోజులు పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మూడు రోజుల షెడ్యూల్ విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజలతో మమేకం కానున్నారు. అదే సమయంలో క్యాడర్ పైన ఆయన ఫోకస్ పెడతారు అని భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

రేపు బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి అక్కడే అరటి రైతులతో మాట్లాడతారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.

కొద్ది నెలల కిందట జరిగిన జడ్పిటిసి బై ఎలక్షన్స్ లో పులివెందుల నియోజకవర్గం లో వైసీపీ కనీసం తమ పార్టీ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. జగన్ కు కంచుకోట అని భావించే పులివెందులలో ఘోర పరాజయాన్ని ఎదురుచూసింది. దశాబ్దాలుగా వారి కుటుంబంతో ప్రయాణిస్తున్న కార్యకర్తలు కూడా జడ్పిటిసి ఒక ఎన్నికల సందర్భంగా వెనకడుగు వేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వైసిపి ఆరోపించినా.. కనీసం ఏజెంట్ లను కూడా నిలబెట్టుకోలేకపోవడం ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అర్థం పడుతుంది. ఈ క్రమంలో ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా కేడర్ తో సమావేశం అవుతారా..? వారికి దిశానిర్దేశం చేస్తారా..? కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతారా..? అనేది చూడాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయన కార్యకర్తలతో, స్థానిక నేతలతో సమావేశం అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

This post was last modified on November 25, 2025 2:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చక్కని అవకాశం చెన్నై చేజారింది

నెల రోజుల క్రితం చెన్నై లవ్ స్టోరీ నుంచి మొదటి పాట రిలీజ్ సందర్భంగా కథకుడు సాయి రాజేష్ ఒక…

26 minutes ago

‘కాంగ్రెస్‌… మావోయిస్టు పార్టీ కంటే దారుణం’

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జ‌రిగిన బీజేపీ స‌భ‌లో కాంగ్రెస్…

2 hours ago

తమిళనాట పాడిన వందే మాతరం… బెంగాల్ లో లేదెందుకు?

వందేమాతరం ఆలపించడంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ప్రధాని ప్రమాణ స్వీకారం,…

4 hours ago

రామ్ విసుగొచ్చే రూటు మార్చాడా

ఇప్పుడున్న జనరేషన్ హీరోలు దర్శకులుగా మారడం అరుదు. కాకపోతే చిరంజీవి తరంతో పోల్చుకుంటే కొంచెం బెటరని చెప్పొచ్చు. మెగాస్టార్ తో…

4 hours ago

అమెరికా పెద్ది గురించి ఇండియాలో చర్చ

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ఇప్పుడొక అవసరం లేని టాపిక్ గురించి చర్చలోకి వచ్చింది. ఒక ఎన్ఆర్ఐ, టికెట్…

4 hours ago

సాయిపల్లవిని ఎందుకు మర్చిపోయారు

నిన్న సాయిపల్లవి పుట్టినరోజు. అసలు విశేషం అది కాదు. రామాయణలో సీతగా నటించిన తనకు బర్త్ డే కానుకగా ఒక…

5 hours ago