థియేటర్లు తెరుస్తాం సరే… జనం వస్తారా రారా అనేది ఇంతకాలం భారతీయ చిత్ర పరిశ్రమను వేధించిన ప్రశ్న. సగం టికెట్లు అమ్మడం ఒకటయితే… ఆ సగం టికెట్లయినా అమ్ముడవుతాయా లేదా, అసలు ఈ కరోనా టైమ్లో జనం థియేటర్లలో అడుగుపెడతారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేటి నుంచి హైదరాబాద్లో పలు థియేటర్లు ఆపరేట్ అవుతున్నాయి.
మొదటి రోజు ప్రేక్షకులు థియేటర్లకు బాగానే వెళ్లినట్టు. మిగతా సినిమాల మాట ఎలా వున్నా క్రిస్టఫర్ నొలాన్ సినిమా టెనెట్ను థియేటర్లో చూసేందుకు జనం తరలి వెళ్లారు. శని, ఆదివారాల బుకింగ్స్ కూడా ఆశాజనకంగానే వున్నాయి. దీంతో విడుదల చేయాలా వద్దా అనే మీమాంసలో వున్న సినిమాల నిర్మాతలు కాస్త ధైర్యం చేయవచ్చు.
అయితే సింగిల్ థియేటర్స్లో తగు జాగ్రత్తలు ఎలా తీసుకుంటారనేది చెప్పడం కష్టమే. ముఖ్యంగా వాష్ రూమ్ల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. మల్టీప్లెక్సులంటే గట్టి చర్యలు చేపట్టాయి కనుక అక్కడికెళ్లి సినిమా చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా భయపడడం లేదని అర్థమయింది. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కూడా ఇదే స్థాయిలో వచ్చినట్టయితే మిడిల్ రేంజ్ సినిమాలను విడుదల చేయడం షురూ చేసుకోవచ్చు.
This post was last modified on December 4, 2020 7:18 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…