తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడం, రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని తేలిపోవడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తెలుగునాట చిరంజీవి, పవన్కళ్యాణ్కి ఎదురయిన పరాభవంతో రజనీకాంత్కి ఎలాంటి అనుభవం ఎదురవుతుందోననే భయం కొందరిలో వుంది. రజనీకాంత్ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఇటు మెగా ఫాన్స్ కూడా ఆసక్తిగా చూస్తారు. వారితో పాటు మెగా వ్యతిరేక హీరోల అభిమానులు కూడా రజనీ రాజకీయ ప్రస్థానంపై దృష్టి పెడతారు.
చిరంజీవి, పవన్కళ్యాణ్ల ఓటమిని ఫాన్స్ పలు విధాలుగా సమర్ధించుకున్నారు. ఇప్పటి మీడియా ఎక్సర్సైజ్ని దాటి గెలవడం కష్టమని, టీడీపీ, వైసీపీ ధన బలం ముందు వాళ్లు నిలబడలేకపోయారని అనుకుని ఊరుకున్నారు. కానీ రజనీకాంత్ కనుక అలాంటి అననుకూలతలను అధిగమించి రాణిస్తే మాత్రం మెగా ఫాన్స్ ఇరుకున పడతారు. మిగతా హీరోల అభిమానులు ట్రోలింగ్లో రెచ్చిపోతారు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు వేరుగా వున్నాయి. ఇప్పుడక్కడ రాజకీయ శూన్యత నెలకొంది కనుక అది రజనీకాంత్కి ప్లస్ పాయింట్ అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అవన్నీ ట్రోల్ చేసే వారు కన్సిడర్ చేయరు కనుక వచ్చే ఎన్నికల నాటికి అయినా పవన్ తన సత్తా చాటుకోని పక్షంలో మెగా అభిమానులకు సోషల్ మీడియాలో అజ్ఞాతవాసం తప్పదు.
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…