నేనే హైదరాబాద్ను అభివృద్ధి చేశాను. సైబరాబాద్ వంటి మహా ఐటీ సామాజ్రాన్ని ఏర్పాటు చేసిన రూప శిల్పిని నేనే. నాకు తప్ప.. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు మరే ఇతర పార్టీకి కూడా లేదు- అని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ దెబ్బే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. మొత్తం 150 డివిజన్లలో ఏ ఒక్క చోట కూడా పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. నిజానికి గ్రేటర్ ఎన్నికల సమయంలో చంద్రబాబు హైదరాబాద్లోనే ఉన్నారు.
ఆయన ఆన్లైన్ వేదికగా డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా రాష్ట్ర పార్టీ చీఫ్పై తన సత్తాకు ఈ ఎన్నికలు నిదర్శమని భావించారు. ఈ క్రమం లోనే అభ్యర్థులను కూడా ఆచి తూచి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక, గ్రేటర్ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు.. చంద్రబాబు స్వయంగా ఆయా అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హైదరాబాద్ను చుట్టుముట్టిన వరదల విషయాన్ని హైలెట్ చేయాలని అన్నారు. ఓటు అడిగే హక్కు కూడా తమకే ఉందని చెప్పారు.
కానీ, అనూహ్యంగా పార్టీ ఒక్కచోట కూడా గెలుపు గుర్రం ఎక్కలేకపోయింది. నిజానికి ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తారనాక ఇలా అనేక ప్రాంతాల్లోనూ టీడీ పీ ఎక్కడా తన సత్తా చాటలేక పోయింది. మరి.. ఈ పరిణామం దేనికి సంకేతంగా భావించాలి? చంద్రబాబు పై విశ్వాసం సన్నగిల్లిందని అనుకోవాలా? లేక పార్టీని తెలంగాణ ప్రజలు గుర్తించడం మానేశారని భావించాలా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
గత 2016 గ్రేటర్ ఎన్నికల్లో.. సీఎం హోదాలో చంద్రబాబు భారీ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్ కూడా ప్రచారానికి దిగారు. కానీ, ఐదేళ్లు తిరిగే సరికి ఇరువురూ చేతులు ఎత్తేశారు. ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేక పోయారనే వాదన ఉంది. ఇలా.. కారణాలు ఏవైనా.. మొత్తానికి భాగ్యనగరంలో తెలుగుదేశం పార్టీ ఇక.. చరిత్రలో కలిసిపోయినట్టే!! అనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం ఆ పార్టీ సానుభూతిపరులకు గుండెను మెలిపెట్టినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 4, 2020 7:08 pm
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…