Movie News

ఫ్యామిలీ మ్యాన్-3.. ఎవరెంత పుచ్చుకున్నారు?

ఇండియన్ వెబ్ సిరీస్ చరిత్రలో ‘ఫ్యామిలీ మ్యాన్’ను మించి ఆదరణ పొందిన ఒరిజినల్ ఇంకోటి లేదు అంటే అతిశయోక్తి కాదు. నటుడిగా ఎప్పుడో లెజెండరీ స్టేటస్ అందుకున్నప్పటికీ.. ఈ సిరీస్‌తో మనోజ్ బాజ్‌పేయికి మామూలు పేరు రాలేదు. ఇక దర్శకులుగా రాజ్-డీకే సైతం వేరే లెవెల్‌కు వెళ్లిపోయారు. ఈ సిరీస్ సక్సెస్ అయ్యాక వాళ్లు సినిమాలకు స్వస్తి చెప్పి.. వెబ్ సిరీస్‌లే చేస్తున్నారు. కానీ ‘ఫ్యామిలీ మ్యాన్’ అయినంత సక్సెస్ ఇంకేదీ కాలేదు. 

ఇప్పటికే రెండు సీజన్లతో అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొన్న అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి ఇది ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి స్ట్రీమింగ్ రికార్డులను ‘ఫ్యామిలీ మ్యాన్’ బద్దలు కొడుతుందనే అంచనాలున్నాయి. మరి ఇంత క్రేజీ సిరీస్‌లో నటించేందుకు ప్రధాన పాత్రధారుల్లో ఎవరు ఎంత పుచ్చుకున్నారన్నది ఆసక్తికరం.

మూడో సీజన్ కోసం ‘ఫ్యామిలీ మ్యాన్’ హీరో, శ్రీకాంత్ తివారి పాత్రధారి మనోజ్ బాజ్‌పేయి రూ.22.5 కోట్లు పారితోషకంగా అందుకున్నాడట. మనోజ్‌కు జోడీగా సుచిత్ర పాత్రలో వరుసగా మూడో సీజన్లోనూ నటించిన ప్రియమణి.. ఈసారి రూ.7 కోట్ల రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. పాతాళ్ లోక్ సిరీస్‌తో బంపర్ క్రేజ్ తెచ్చుకుని.. ‘ఫ్యామిలీ మ్యాన్-3’లో విలన్ పాత్ర చేసిన జైదీప్ అహ్లావత్ రూ.9 కోట్లు పుచ్చుకున్నాడట. జేకే తల్పాడే పాత్రలో భలేగా వినోదాన్ని పంచుతున్న షరిబ్ హష్మి మూడో సీజన్‌కు రూ.5 కోట్లు తీసుకున్నాడట. 

నిమ్రత్ కౌర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తనకున్న క్రేజ్ దృష్ట్యా రూ.9 కోట్ల పారితోషకం తీసుకుందని సమాచారం. అంతకంటే తక్కువ నిడివే అయినప్పటికీ.. దర్శన్ కుమార్ రూ.8 కోట్ల దాకా పారితోషకం తీసుకున్నాడట. ఇంకా ఇందులో విజయ్ సేతుపతి, శ్రేయా ధన్వంతరి, సందీప్ కిషన్ చిన్న చిన్న పాత్రల్లో నటించారు. మొత్తంగా పారితోషకాలు మాత్రమే చూసుకున్నా బడ్జెట్ రూ.100 కోట్లకు తక్కువ అయి ఉండదని అంచనా.

This post was last modified on November 22, 2025 7:56 pm

Share

Recent Posts

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

41 minutes ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

1 hour ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

1 hour ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

2 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

2 hours ago

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

4 hours ago