Political News

రాజధాని రైతులకు భరోసా… ఆరు నెలల్లోగా..?

రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌న్నీ ఆరునెలల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని త్రీమెన్ క‌మిటీ హామీ ఇచ్చింది. స్వార్ధం కోసం ఒక‌రిద్ద‌రు చెప్పే మాట‌లు ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని క‌మిటీ స‌భ్యులు సూచించారు. ప్ర‌తి రెండు వారాల‌కోసారి స‌మావేశ‌మై రైతుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేలా ముందుకెళ్తామ‌ని క‌మిటీ తెలిపింది. రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నియ‌మించిన క‌మిటీ రెండో స‌మావేశం అమ‌రావ‌తిలోని మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. 

కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్రశేఖ‌ర్ మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, వాటిని ఒక్కొక్క‌టిగా పరిష్క‌రిస్తూ వ‌స్తున్నామ‌న్నారు. రైతుల ప్లాట్ల‌కు సంబంధించి ఇంకా కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని స‌మ‌స్య‌లున్నాయ‌న్నారు.

ఇప్ప‌టికే 98 శాతం ప్లాట్ల కేటాయింపు పూర్త‌యిపోయింద‌న్నారు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్ర స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత పరిష్కరిస్తామ‌ని తెలిపారు. మ‌రోవైపు లంక అసైన్డ్ భూముల‌కు సంబంధించి ప్ర‌స్తుతం నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ లో కేసు పెండింగ్ లో ఉంద‌న్న మంత్రి….ఫిబ్ర‌వ‌రిలో తీర్పు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.

మంత్రి పొంగూరి నారాయ‌ణ‌ మాట్లాడుతూ అమ‌రావ‌తిలో రైతులకు సంబంధించి అన్ని స‌మ‌స్య‌లు 6 నెల‌ల్లో ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. రాజ‌ధానిలో ప్ర‌తి రైతుకూ న్యాయం చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు..రైతుల‌కు కేటాయించిన రిట‌ర్న‌బుల్ ప్లాట్ల‌కు సంబంధించి రిజిస్ట్రేష‌న్లు వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. మ‌రోవైపు భూములిచ్చిన రైతుల్లో ఇంకా కేవ‌లం 719 మందికి మాత్ర‌మే ప్లాట్లు కేటాయించాల్సి ఉంద‌ని తెలిపారు. స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలను ఎవరూ నమ్మవద్దని మంత్రి కోరారు.

This post was last modified on November 22, 2025 6:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

4 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

5 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

5 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

7 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

7 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

9 hours ago