డిసెంబర్ అయిదు విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం ఎప్పుడూ చూడని ఒక సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే 3డి వర్షన్. ఇప్పటిదాకా బాలకృష్ణ కెరీర్ లో ఏ సినిమా ఈ సాంకేతికత వాడలేదు. ఆ మాటకొస్తే సీనియర్ స్టార్లు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు కూడా ఈ టెక్నాలజీ అవసరం పడలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ కి 3డి వాడారు కానీ ఆడియన్స్ కి పెద్దగా తేడా అనిపించలేదు. సబ్ టైటిల్స్ ముందుకు చొచ్చుకు రావడం తప్ప ఎలాంటి ఫీలింగ్ కలిగించలేదు. కాబట్టి దాన్ని ఒరిజినల్ కన్వర్షన్ గా పరిగణించలేం. కానీ అఖండ 2 అలా కాదు.
అత్యున్నత సాంకేతికత వాడి త్రీడిలోకి మారుస్తున్నారు. మీడియాకు ప్రదర్శించిన కొన్ని శాంపిల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకవేళ ఫుల్ వెర్షన్ కూడా ఇదే స్థాయిలో ఉంటే మాత్రం జనం ఎగబడి చూడటం ఖాయం. అఖండ 2 ఈసారి ఉత్తరాది మార్కెట్ ని బలంగా టార్గెట్ చేసుకుంది. అందుకే ప్రమోషన్లు ముంబై నుంచి మొదలుపెట్టారు. అఖండ 1కి ఓటిటిలో నార్త్ సినీ ప్రియులు ఇచ్చిన స్పందన చూశాక సీక్వెల్ కోసం బలమైన థియేట్రికల్ ప్లానింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే త్రీడి ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం మొదలయ్యింది. దీని కోసం అదనంగా బడ్జెట్ ఖర్చవుతున్నా నిర్మాతలు సిద్ధ పడ్డారు.
ఇంకో పంతొమ్మిది రోజులు మాత్రమే టైం ఉండటంతో టీమ్ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టబోతోంది. డిసెంబర్ మొదటివారం యుఎస్ ట్రిప్ ఉంటుంది. దర్శకుడు బోయపాటి శీను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి డబుల్ మార్జిన్ తో బ్లాక్ బస్టర్ ఖాయమని చెబుతున్నారు. సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పే ఈ మూవీ 3డిలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. 21న కర్ణాటకలో ట్రైలర్ లాంచ్, అంతకన్నా ముందు వైజాగ్ లో సాంగ్ లాంచ్ ఉంటాయట. ముందు రోజు రాత్రే అభిమానుల కోసం స్పెషల్ ప్రీమియర్లు వేసే ఆలోచన బలంగా ఉంది.
This post was last modified on November 16, 2025 4:19 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…