తమిళంలో ఓ మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని నంబర్ వన్ హీరోగా కొనసాగాడు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడును దాటి విస్తరించిన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ను ఎవ్వరూ అందుకునే పరిస్థితి కనిపించలేదు. సినిమాల్లో కొనసాగినంత కాలం రజినీనే నంబర్ వన్ అనుకున్నారు ఓ పదేళ్ల ముందు వరకు. కానీ రజినీ వరుసగా ఫ్లాపులు ఇస్తున్న టైంలోనే తుపాకి, కత్తి, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్లతో విజయ్ ఎవ్వరూ ఊహించని రేంజికి వెళ్లిపోయాడు.
ఆయన సినిమాల బిజినెస్, వసూళ్లు రజినీ చిత్రాలను కూడా దాటిపోయాయి. ఇప్పుడు తమిళంలో విజయే నంబర్ అనడంలో సందేహం లేదు. కానీ కెరీర్లో ఇలాంటి పీక్స్ అందుకున్న టైంలో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు విజయ్. భగవంత్ కేసరికి రీమేక్గా భావిస్తున్న ‘జననాయగన్’యే ఆయన చివరి సినిమా. ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చి సినీ రంగానికి విజయ్ టాటా చెబుతాడని భావిస్తున్నారు.
రాజకీయాల్లో ఫలితాలను బట్టి భవిష్యత్తులో విజయ్ తిరిగి సినిమాల్లోకి వస్తే చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి ‘జననాయగన్’యే ఆయన చివరి చిత్రం. ఈ నేపథ్యంలో సినిమా చివర్లో విజయ్ ఫేర్వెల్ను ఘనంగానే ప్లాన్ చేస్తున్నాడట విజయ్. ముందు ముగింపు సన్నివేశాలను ఎమోషనల్గా ప్లాన్ చేశారట. కానీ తర్వాత విజయ్ సూచన మేరకు మార్పు చేశారట. విజయ్ సినీ కెరీర్ను సెలబ్రేట్ చేసేలా పతాక ఘట్టాన్ని ప్లాన్ చేశారట.
అందులో విజయ్తో మంచి అనుబంధం ఉన్న దర్శకులు అట్లీ, లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ కనిపిస్తారట. వారికి విజయ్ ఒక బ్యాటన్ ఇవ్వనున్నట్లు చూపిస్తారట. ఇటీవలే రిలీజైన ‘దళపతి కచేరి’ పాట ఆఖర్లోనే వస్తుందట. చివరగా ఒక నిమిషం పాటు విజయ్ నాన్ స్టాప్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తాడట. ఆపై విజయ్ ఫిల్మోగ్రఫీలో పీక్ మూమెంట్స్ను చూపిస్తూ రోలింగ్ టైటిల్స్ పడతాడయని.. విజయ్ తన స్టయిల్లో అభిమానులకు అభివాదం చేయడంతో సినిమా ముగుస్తుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on November 11, 2025 10:55 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…