Political News

కొన్ని గంటలు.. మూడు ఆలయాలు… 165 కోట్ల విరాళం

ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్‌మ్యాన్, రిచెస్ట్ మ్యాన్ ఎవ్వరు అంటే తడుముకోకుండా ముకేశ్ అంబాని పేరు చెప్పేస్తారు ఎవ్వరైనా. ధీరూబాయి అంబానీ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన పెద్ద కొడుకైన ముకేశ్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లారు. లక్షల కోట్లకు అధిపతిగా కొనసాగుతున్నారు.

తమ్ముడు అనిల్ అంబానీ ఒక ఫెయిల్యూర్ బిజినెస్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకుని అప్రతిష్ట పాలైతే.. ముకేశ్ మాత్రం ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు సైతం పెద్ద ఎత్తునే చేస్తుంటారు. ముకేశ్‌కు భక్తీ ఎక్కువే. ఆయన ఒక్క రోజులో.. కొన్ని గంటల వ్యవధిలో మూడు ఆలయాలను సందర్శించి భారీ విరాళాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన ముకేశ్ అంబానీ ఏకంగా రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు. తిరుమల అన్నదానం ట్రస్టుకు ఆయన ఈ విరాళాన్ని అందించారు. రోజూ 2 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా కొత్త వంటశాల నిర్మించి, దాని నిర్వహణకు గాను గాను ఆయన ఈ విరాళం ప్రకటించారు. ప్రస్తుతం తిరుమలలో వెంగమాంబ పేరుతో నిత్యాన్నదాన సత్రం భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు రాజస్థాన్‌లోని నాథ్ ద్వారా గుడిని కూడా సందర్శించిన ముకేశ్.. ఆ ఆలయ ట్రస్టుకు రూ.50 కోట్ల విరాళం అందించారు. ఇంకోవైపు కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించిన ముకేశ్.. దాని ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రికి తొలి విడతగా రూ.15 కోట్ల విరాళం ఇచ్చారు. భవిష్యత్తుగా మరిన్ని నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇలా ముకేశ్ ఒక్క రోజే కొన్ని గంటల వ్యవధిలో మూడు ఆలయాలను సందర్శించి రూ.165 కోట్ల భారీ విరాళాలు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. 

This post was last modified on November 11, 2025 6:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago