వచ్చే వారం విడుదలవుతున్న సినిమాల్లో దుల్కర్ సల్మాన్ కాంత మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. దగ్గుబాటి రానా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడమే కాదు కీలక పాత్ర పోషించడంతో హైప్ పరంగా ప్లస్ అవుతోంది. ఇటీవలే ట్రైలర్ రూపంలో కంటెంట్ ఎలా ఉండబోతోందో చూపించేశారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ డ్రామాలో సముతిరఖని హీరో తర్వాత అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ కాంతకో చింత ఉంది. అదేంటంటే ఈ మూవీ బ్యాక్ డ్రాప్ పూర్తిగా చాలా తక్కువ చిత్రాల్లో నటించిన ఒక లెజండరీ తమిళ నటుడికి సంబందించినదట.
జీవితాన్ని ఇచ్చిన గురువుతోనే ఈగోకి వెళ్లి కెరీర్ ని మార్చుకున్న ఒక యాక్టర్ జీవితాన్ని కాంతలో చూపించబోతున్నారు. ఇందులో నిజాలు ఉంటాయి, క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. కాకపోతే మన ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందనేది కీలకం. ఎందుకంటే దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఎక్కువ తమిళ్ ఫ్లేవర్ లోనే తీసిన వైనం స్పష్టం. మన నేటివిటీ ఎంత వరకు అనిపిస్తుందనేది స్క్రీన్ మీద చూస్తే కానీ క్లారిటీ రాదు. మహానటిని మనం అంతగా ఎగబడి చూడ్డానికి కారణం సావిత్రి తెలియని తెలుగు ఇల్లు లేకపోవడమే. కానీ కాంతలో అలాంటి ఛాన్స్ లేదు. ఇది ఫలానా వారి బయోపిక్ అని టీమ్ ఎక్కడా చెప్పలేదు.
పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కాంతకు పండగే. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ లేదు. ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలు మంచి టాక్ తో డీసెంట్ వసూళ్లు రాబడుతున్నాయి కానీ మరీ అద్భుతాలు చేయడం లేదు. ఒకవేళ ఆదివారం అనూహ్యంగా రెట్టింపు పికప్ చూపిస్తే కనక సూపర్ హిట్ స్టాంప్ వేసేయొచ్చు. ఇంకో రెండు మూడు రోజులు ఆగితే కానీ కమర్షియల్ రిజల్ట్ ఏంటనేది బయట పడదు. కాంతకు పోటీగా సంతాన ప్రాప్తిరస్తు ఉంది. శివ రీ రిలీజ్ హడావుడి ఎక్కువగానే జరిగేలా ఉంది. మరి కాంత ఈ చింతలన్నీ తట్టుకుని విజేతగా నిలవాలంటే ఎక్స్ ట్రాడినరి టాక్ రావాల్సిందే.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…