ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో సమాజంలోని మహిళలు, అట్టడుగు వర్గాలకు సేవలందిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి.. ఎన్టీఆర్ తనయ నారా భువనేశ్వరి.. తాజాగా మరోసేవకు శ్రీకారం చుట్టారు. ఈసేవ ద్వారా మహిళలకు ఆర్థికంగా ఆమె ఊతమివ్వనున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలలోని ఎన్టీఆర్ ట్రస్టుకేంద్రాల్లో మహిళలకు చేతి వృత్తులు నేర్పించారు. తద్వారా వారిని సొంత కాళ్లపైనిలబడేలా చేస్తున్నారు.
ఇలా ఉపాధి పొందుతున్న మహిళలతో `స్త్రీ శక్తి మహిళా సంఘం` ఏర్పాటు చేశారు. దీనిలో 600 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం ద్వారా వారు రూపొందించిన వస్తువులను మార్కెటింగ్ చేసే బాధ్యతనుకూడా ఎన్టీఆర్ ట్రస్టే తీసుకుంది. దీనిలో భాగంగా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ, కర్నూలు, వరంగల్ సహా పలు ప్రధాన నగరాల్లో `స్త్రీ శక్తి హ్యాండీ క్రాఫ్ట్స్ స్టోర్స్`ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టోర్స్లో ఎన్టీఆర్ ట్రస్ట్లోని మహిళలు రూపొందించిన వస్తువులను విక్రయంచనున్నారు.
స్వల్ప లాభాలతో నాణ్యమైన మెటీరియల్తో రూపొందించిన ఈ వస్తువులవిక్రయాలను తాజాగా నారా భువనేశ్వరి ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెయిన్గేట్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి హ్యాండీ క్రాఫ్ట్స్ స్టోర్ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం.. వచ్చిన లాభాల్లో ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును సంఘానికే చెందిన ఖాతాలో వేయనున్నారు. దీని నుంచి సభ్యులకు ఖర్చు చేయనున్నారు. మహిళలకు అవసరమైన వస్త్రాలు, వస్తువులు, ఇతర ఆభరణాలు ఈ స్టోర్స్లో తక్కువ ధరలకే లభించనున్నాయి.
This post was last modified on November 9, 2025 7:25 am
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…