కొన్ని వారాల క్రితమే మోహన్ లాల్ హీరోగా మలయాళం దృశ్యం 3 షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దర్శకుడు జీతూ జోసెఫ్ వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నారు. నిజానికి అన్ని భాషల్లో సమాంతరంగా షూట్ చేసి ఒకేసారి రిలీజ్ చేయాలనే మూవీ లవర్స్ డిమాండ్ తీరేలా లేదు. ఎందుకంటే వెంకటేష్ ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. మన శంకరవరప్రసాద్ గారు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాల్సి ఉంది. ఇదంతా అయ్యేలోపు 2026 వేసవి గడిచిపోతుంది. ఆలోగా ఒరిజినల్ దృశ్యం 3 ఏకంగా రిలీజ్ కు రెడీ అయిపోతుంది. అదే సమస్య.
బాలీవుడ్ సైడ్ చూసుకుంటే అజయ్ దేవగన్ డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నిర్మాతల మధ్య రీమేక్ హక్కులకు సంబంధించి ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదట. నిజానికి జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి ముందే హిందీ దృశ్యం 3 కోసం వేరే కథ రాసుకున్నారు అక్కడి టీమ్ సభ్యులు. ఒకవేళ అలా చేస్తే కనక లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని జీతూ జోసెఫ్ చెప్పడంతో ఆ ఆలోచన వాయిదా వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈలోగా అజయ్ దేవగన్ వేరే కమిట్ మెంట్లతో బిజీ అయిపోయాడు. వెంకటేష్ తరహాలోనే ఇప్పుడప్పుడే తను కూడా ఫ్రీ అయ్యేలా లేడు.
ఈ ప్రాబ్లమ్ తమిళం కన్నడలో లేదు. ఎందుకంటే కమల్ హాసన్, రవిచంద్రన్ లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తెలుగు హిందీలోనే మేకర్స్ నుంచి చేయాలనే డిమాండ్ ఉంది. జీతూ జోసెఫ్ చెబుతున్న ప్రకారం ఒకవేళ రీమేక్ వెర్షన్లకు ఎక్కువ సమయం పట్టేలా ఉంటే మలయాళం వెర్షన్ రిలీజ్ చేస్తామని, దాని వల్ల స్పాయిలర్స్, స్టోరీ లీక్స్ జరిగినా ఎవరేం చేయలేమనే రీతిలో సంకేతాలు ఇస్తున్నారు. అదే జరిగితే కనక దృశ్యం 3లో రాంబాబు ఏం చేస్తాడో అనే సస్పెన్స్ ని మన ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సినిమా కన్నా బయటే ఎక్కువ ట్విస్టులు జరుగుతున్న దృశ్యం 3 ఫైనల్ గా ఏ మజిలీ చేరుకుంటుందో.
This post was last modified on November 1, 2025 9:21 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…