Political News

గత పాలనలో న్యాయమూర్తులనూ వేధించారు: జస్టిస్ ఎన్వీ రమణ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి భ‌విష్య‌త్తులో ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఎదుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌రిగిన అతిపెద్ద పోరాటం ఏదైనా ఉంటే.. అది అమ‌రావ‌తి కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాట‌మేన‌ని చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలోని విట్‌విశ్వ‌విద్యాల‌యం లో జ‌రిగిన 5వ స్నాత‌కోత్స‌వంలో జస్టిస్ ఎన్డీ ర‌మ‌ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.

అమ‌రావ‌తి కోసం..

ఒక ప్ర‌భుత్వం తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను త‌దుప‌రివ‌చ్చే ప్ర‌భుత్వాలు కొన‌సాగించ‌క‌పోతే.. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది గ‌త ఎన్నిక‌ల్లో చూశామ‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్ట‌డం స‌రికాద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లు అంగీక‌రించార‌న్నారు. అమ‌రావ‌తి రైతులు త‌మ‌కు వార‌స‌త్వంగా వ‌చ్చిన భూముల‌ను రాజ‌ధాని కోసం ఇచ్చార‌ని.. దీనిని నిలిపివేయ‌డంతో వారికి ఆద‌ర‌వు లేకుండా పోయింద‌న్నారు. ఈ క్ర‌మంలోనే వారు సుదీర్ఘ పోరాటం చేశార‌ని చెప్పారు. దీనిని దేశం మొత్తం అంగీక‌రించింద‌న్నారు.

అయితే.. ఈ క్ర‌మంలో రైతులు చేసిన న్యాయ‌పోరాటానికి చ‌ట్టం ప‌రిధిలో అండ‌గా నిలిచిన న్యాయ‌వాదులు.. న్యాయ‌మూర్తుల‌కు కూడా నిర్బంధాలు , వేధింపులు త‌ప్ప‌లేద‌న్నారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. ఆనాడు అనేక మంది న్యాయ‌మూర్తులు అమ‌రావ‌తి రైతుల‌కు అనుకూలంగా వ్యాఖ్యానించినందుకు.. బ‌దిలీ అయ్యార‌ని, అనేక మంది వేధింపులకు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు కూడా గుర‌య్యార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికార వ్య‌వ‌స్థ‌ను ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు వినియోగించిన కార‌ణంగానే.. ఇలా జ‌రిగింద‌న్నారు. ఆ విధంగా ప్ర‌తీకార రాజ‌కీయాలు చేయ‌డాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేద‌ని చెప్పారు.

ఎన్ని నిర్బంధాలు వ‌చ్చినా వెనుక‌డుగు వేయ‌కుండా.. రైతులు రాజ‌ధాని కోసం చేసిన ఉద్య‌మం.. ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగి న వైనం.. చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. వారికి పేరు పేరునా తాను న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ చెప్పారు. కృత్రిమ మేథ(ఏఐ) క‌న్నా.. మాన‌వ మేధ‌స్సు అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ఏఐని న‌మ్ముకుని ఉద్యోగాల‌ను తీసేస్తున్న స‌మ‌స్య‌లు.. 95 శాతం వ‌ర‌కు న‌ష్టం పోతున్నాయ‌న్నారు. మాన‌వ మేథ‌స్సును మించిన వ్య‌వ‌స్థ ఏదీలేద‌న్నారు. అవ‌స‌రం మేర‌కు సామాజిక మాధ్య‌మాల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. ఇక‌, మీడియా ఏక‌ప‌క్ష ధోర‌ణుల‌ను కూడా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌ప్పుబ‌ట్టారు.

This post was last modified on November 2, 2025 1:28 am

Share

Recent Posts

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

2 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

3 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

5 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

5 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

5 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

6 hours ago