‘మహానటి’ సినిమా అద్భుత విజయాన్నందుకున్నాక తెలుగులో ఉన్న లెజెండరీ నటీనటులందరి అభిమానులకూ తమ అభిమాన తారల బయోపిక్స్ తెరపై చూసుకోవాలని అనిపించే ఉంటుంది. నందమూరి తారక రామారావు జీవిత కథను తెరపైకి తీసుకొచ్చారు కానీ.. దానికి సరైన టైమింగ్ కుదరకపోవడం వల్లో, అందులో చూపించిన అంశాలు సెలక్టివ్గా ఉండడం వల్లో అది ఆడలేదు. ఏఎన్నార్ బయోపిక్ గురించి నాగ్ ఆలోచించారు కానీ ఎందుకో అది కుదరలేదు.
ఐతే ఇలా జీవించి లేని దిగ్గజాల మీద సినిమాలు తీయడానికే ఎక్కువమంది ఆలోచిస్తారు కానీ.. మన మధ్యే ఉన్న ఒక ఇన్స్పైరింగ్ ఆర్టిస్టు మీద సినిమా తీసేద్దాం అనుకున్నాడట యువ కథానాయకుడు సిద్దు జొన్నలగడ్డ. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగు పెట్టి.. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసి.. ఆపై హీరో అవతారం ఎత్తి.. కొన్నేళ్ల కష్టం తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ బయోపిక్ను సిద్ధు చేయాలనుకున్నాడట. మాస్ రాజాతో కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు.. ఆయన ముందే ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో బ్రేక్ అందుకున్నాక.. రవితేజ బయోపిక్ చేద్దామని సీరియస్గా రంగంలోకి దిగాడట సిద్ధు. కొన్ని రోజులు రీసెర్చ్ కూడా చేశాడట. కానీ తర్వాత ఏవో కారణాలతో ఆ సినిమా ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయిన రవితేజ.. తాను కూడా ఒక నటుడి బయోపిక్ చేద్దామని గతంలో అనుకున్నట్లు వెల్లడించాడు. కానీ ఆ నటుడెవరో చెప్పలేదు.
ఎవరి బయోపిక్స్ తీసినా.. అందులో పాజిటివ్ కోణాలను మాత్రమే చూపించడం కరెక్ట్ కాదని.. వారి జీవితాల్లోని ప్రతికూల విషయాలను కూడా తెరపైకి తీసుకురావాలని.. అప్పుడే ఆ బయోపిక్కు న్యాయం జరుగుతుందని మాస్ రాజా అభిప్రాయపడ్డాడు. రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కానుండగా.. సిద్ధు మూవీ ‘తెలుసు కదా’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు హీరోలు తమ చిత్రాలను ప్రమోట్ చేయడం కోసం ఉమ్మడి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
This post was last modified on October 13, 2025 8:32 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…