సాధారణంగా కథ రాసిన రచయిత లేదా సినిమా తీసిన దర్శకుడు టైటిల్ కూడా పెడుతుంటారు. కొన్నిసార్లు మాత్రం హీరోనో, నిర్మాతో పేరు సూచిస్తుంటారు. అది అందరికీ ఆమోదయోగ్యం అయితే కన్ఫమ్ అవుతుంది. తన కొత్త చిత్రం ‘మాస్ జాతర’కు స్వయంగా హీరో రవితేజే టైటిల్ పెట్టాడట. ఈ విషయాన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న భాను భోగవరపు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రవితేజకు తొలిసారి ఈ కథ చెప్పినపుడు ఇందులో మాస్ అంశాలు బాగా నచ్చి, తనకు బాగా సూటయ్యే సినిమా అని భావించిన రవితేజ.. నరేషన్ అవ్వగానే ‘మాస్ జాతర’ అంటూ టైటిల్ సూచించాడట. తనకు అది కూడా బాగా నచ్చడంతో ఆ టైటిలే కన్ఫమ్ చేశానని భాను తెలిపాడు. ఐతే ఈ టైటిల్కు పెట్టిన క్యాప్షన్ మాత్రం తన క్రెడిటే అని భాను తెలిపాడు.
కానీ ‘మనదే ఇదంతా’ అనే క్యాప్షన్ చెప్పినపుడు రవితేజ అది వద్దు అని అన్నాడట. ఐతే ముందు పెట్టి చూద్దాం, తర్వాత వద్దనుకుంటే తీసేద్దాం అని భాను చెప్పగా.. రవితేజ సరే అని చెప్పాడట. చివరికి ఆ క్యాప్షన్ కూడా బాగుందని దాన్ని ఖరారు చేశారట. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాలో తన భాష, యాస, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయని దర్శకుడు, హీరోయిన్ శ్రీలీలతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో రవితేజ వెల్లడించాడు. తాను ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అవీ బాగానే ఫాలో అవుతానని.. వాటిని ఎంజాయ్ చేస్తానని.. కానీ ట్విట్టర్ అంటే మాత్రం నచ్చదని రవితేజ తెలిపాడు. ఇక్కడంతా నెగెటివిటీనే ఉంటుందని.. ఈ బ్యాచ్ అంతా వేరే అని, అందుకే తాను ట్విట్టర్లో యాక్టివ్గా ఉండనని రవితేజ తెలిపాడు. ‘మాస్ జాతర’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 7, 2025 9:04 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…