వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు అనకాపల్లి పోలీసులు.. భారీ షాక్ ఇచ్చారు. ఆయనకు రోడ్డు మార్గం లో పర్మిషన్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. సుమార 63 కిలో మీటర్ల మేర రోడ్ షో చేయాలని జగన్ భావించారని.. కానీ, తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారని.. ఈ నేపథ్యంలో జగన్కు రోడ్ షో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఆయన విశాఖపట్నం నుంచి నేరుగా హెలికాప్టర్లో వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్.. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తన హయాంలో తీసుకు వచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 12 కాలేజీలను ప్రవేటు భాగస్వామ్యానికి ఇవ్వడాన్ని ఆయన తప్పుబడు తున్నారు. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. తన నియోజకవర్గంలోనూ.. కొత్తగా మెడికల్ కాలేజీ ప్రారంభించి వదిలేశారని సభలో ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ, దానికి జీవో కూడా లేదని.. అది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమన్నారు. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గంలో నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుందని, కానీ, ఉద్దేశ పూర్వకంగానే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగి సదరు కాలేజీని చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ క్రమంలో గురువారం విశాఖ పర్యటన పెట్టుకున్నారు. విశాఖ నుంచి 63 కిలో మీటర్ల దూరంలో ఉన్న మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ సందర్శించనున్నారు.
దీనికి సంబంధించి వైసీపీ నాయకులు అనకాపల్లి జిల్లా , విశాఖ జిల్లా పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. విశాఖకు వచ్చే జగన్.. అక్కడి నుంచి 63 కిలో మీటర్ల మేర.. రోడ్ షో ద్వారా.. కాలేజీ నిర్మాణంలో ఉన్న మాకవరపాలేనికి వస్తారని పేర్కొన్నారు. రోడ్ షోకు అనుమతించాలని కోరారు. కానీ, తాజాగా అనకాపల్లి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ఘటన నేపథ్యంలో జగన్కు ఆ అనుమతి ఇవ్వలేమని.. ఆయన విశాఖ నుంచి నేరుగా హెలికాప్టర్లో మాకవరపాలేనికి చేరుకోవచ్చని తెలిపారు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on October 7, 2025 6:27 pm
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…