వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు అనకాపల్లి పోలీసులు.. భారీ షాక్ ఇచ్చారు. ఆయనకు రోడ్డు మార్గం లో పర్మిషన్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. సుమార 63 కిలో మీటర్ల మేర రోడ్ షో చేయాలని జగన్ భావించారని.. కానీ, తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారని.. ఈ నేపథ్యంలో జగన్కు రోడ్ షో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఆయన విశాఖపట్నం నుంచి నేరుగా హెలికాప్టర్లో వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్.. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తన హయాంలో తీసుకు వచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 12 కాలేజీలను ప్రవేటు భాగస్వామ్యానికి ఇవ్వడాన్ని ఆయన తప్పుబడు తున్నారు. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. తన నియోజకవర్గంలోనూ.. కొత్తగా మెడికల్ కాలేజీ ప్రారంభించి వదిలేశారని సభలో ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ, దానికి జీవో కూడా లేదని.. అది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమన్నారు. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గంలో నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుందని, కానీ, ఉద్దేశ పూర్వకంగానే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగి సదరు కాలేజీని చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ క్రమంలో గురువారం విశాఖ పర్యటన పెట్టుకున్నారు. విశాఖ నుంచి 63 కిలో మీటర్ల దూరంలో ఉన్న మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ సందర్శించనున్నారు.
దీనికి సంబంధించి వైసీపీ నాయకులు అనకాపల్లి జిల్లా , విశాఖ జిల్లా పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. విశాఖకు వచ్చే జగన్.. అక్కడి నుంచి 63 కిలో మీటర్ల మేర.. రోడ్ షో ద్వారా.. కాలేజీ నిర్మాణంలో ఉన్న మాకవరపాలేనికి వస్తారని పేర్కొన్నారు. రోడ్ షోకు అనుమతించాలని కోరారు. కానీ, తాజాగా అనకాపల్లి జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు ఘటన నేపథ్యంలో జగన్కు ఆ అనుమతి ఇవ్వలేమని.. ఆయన విశాఖ నుంచి నేరుగా హెలికాప్టర్లో మాకవరపాలేనికి చేరుకోవచ్చని తెలిపారు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on October 7, 2025 6:27 pm
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…