కొత్త సినిమాలు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులకు ఉంది. థియేటర్లు జనాలతో కళకళలాడాలని యజమానులకు ఉంది. అలాగే తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేసి ఎక్కువ ఆదాయం పొందాలని నిర్మాతలకూ ఉంది. కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు.
ఇండియాలో థియేటర్లు పున:ప్రారంభానికి అనుమతులైతే వచ్చాయి కానీ.. అవి ఎప్పుడు పూర్తి స్థాయిలో నడుస్తాయో మాత్రం తెలియడం లేదు. అందరూ వెయిట్ అండ్ సీ సూత్రాన్నే పాటిస్తున్నారు. తెరుచుకున్నవే తక్కువ థియేటర్లు, పైగా అవి నామమాత్రంగా నడుస్తున్నాయి.
థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడిస్తే.. ఒక పెద్ద సినిమా రిలీజైతే అంతా సెట్ అయిపోతుందని అని అందరూ చూస్తున్నారు. కానీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో తెలియట్లేదు. ఐతే ఇప్పుడు ఓ ఎగ్జైటింగ్ మూవీ థియేటర్లలోకి రాబోతుండటంతో అందరిలోనూ ఆశలు కలుగుతున్నాయి.
ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ డైరెక్టర్ అనదగ్గ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘టెనెట్’ ఎట్టకేలకు ఇండియాలో విడుదల కాబోతోంది. డిసెంబరు 4న ఈ చిత్రాన్ని ఇంగ్లిష్తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. పోస్టర్లు కూడా వేసేశారు. ఈ సినిమా రిలీజయ్యే సమయానికి థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తాయి.
పూర్తి స్థాయిలో థియేటర్లలో నడిచే రోజుల కోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన నేపథ్యంలో ఇక ఈ చిత్రాన్ని విడుదల చేసేద్దామని ఫిక్సయినట్లున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 శాతం థియేటర్లు నిండినా చాలన్నట్లు ఉంది. అలా నిండాలంటే ‘టెనెట్’ లాంటి క్రేజీ మూవీస్ విడుదల కావాలి. ఈ సినిమా కరోనా టైంలోనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలైంది. సినిమాకు చాలా మంచి టాక్ వచ్చినప్పటికీ.. లాక్ డౌన్ వల్ల ఆశించిన వసూళ్లయితే రాలేదు.
This post was last modified on November 23, 2020 8:22 am
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…