వేసవికి వెలుగుల్లేవు.. దసరా తేలిపోయింది.. దీపావళి ఆరిపోయింది.. కరోనా ధాటికి సినిమాలకు బాగా కలిసొచ్చే సీజన్లు నిస్సారంగా సాగిపోయాయి. సంక్రాంతికి హోరెత్తిపోయిన థియేటర్లు.. ఆ తర్వాత వెలవెలబోయాయి. ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులైతే ఇచ్చింది కానీ.. చాలా వరకు థియేటర్లు మూతపడే ఉన్నాయి.
దసరాకో.. దీపావళికో థియేటర్లలో కాంతులు కనిపిస్తాయనుకున్నారు కానీ.. అలాంటి సంకేతాలేమీ లేకపోయాయి. ఇప్పుడిక క్రిస్మస్ మీద ఆశలు పెట్టుకున్నారు. చూస్తుండగానే నవంబరు నెలాఖరుకు వచ్చేశాం. ఇంకొన్ని రోజుల్లో డిసెంబర్లో అడుగు పెడతాం. కానీ క్రిస్మస్కైనా థియేటర్లన్నీ తెరుచుకుంటాయా.. 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయా అంటే సందేహంగానే ఉంది.
నిజానికి క్రిస్మస్ మీద నిర్మాతలకు మరీ పెద్ద ఆశలేమీ లేవు. అప్పటికి తమ సినిమాలు రిలీజ్ చేసేయాలన్న తొందరేమీ లేదు.
ప్రధానంగా వాళ్ల దృష్టి సంక్రాంతి మీదే ఉంది. ఒకటికి నాలుగు సినిమాలు ఆ సీజన్కు విడుదల ఖరారు చేసుకున్నాయి. అరణ్య, రంగ్దె, క్రాక్, రెడ్ సినిమాలను సంక్రాంతికి షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. క్రిస్మస్కు థియేటర్లు పూర్తి స్థాయిలో నడిస్తే అది ట్రయల్ పీరియడ్ లాగా ఉంటుంది. జనాలు థియేటర్లకు రావడం అప్పుడు మొదలైతే.. సంక్రాంతికి పూర్వపు పరిస్థితులు నెలకొని థియేటర్లలో సందడి నెలకొంటుందని ఆశించారు. కానీ ప్రస్తుతానికైతే ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదు.
పరిస్థితి ఆశాజనకంగా లేదు. మరి సంక్రాంతికి కూడా పరిస్థితులు బాగుపడకపోతే.. ఆ సీజన్కు విడుదల ఖరారు చేసుకున్న సినిమాల పరిస్థితి ఏంటి? ఆ నాలుగు సినిమాలకు తోడు ఇంకో అరడజనుకు పైగానే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతి మిస్సయితే వేసవి వైపు చూడాలి. కానీ దాన్ని టార్గెట్ చేసిన పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. వాటికి పెండింగ్లో ఉన్న సినిమాలు తోడవుతాయి. మరి ఇవన్నీ క్లియరవడానికి ఎంత సమయం పడుతుందో?
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…