గత రెండు వారాలుగా ఇండస్ట్రీని కుదిపేసి ఎక్కడిక్కడ షూటింగులను ఆపేసిన ఫెడరేషన్ సమ్మె వివాదం రేపు పరిష్కారం కోసం చిరంజీవి ఇంటికి చేరనుందని ఫిలిం నగర్ అప్డేట్. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, కార్మిక నాయకులు మెగాస్టార్ సమక్షంలో దీని గురించి చర్చించబోతున్నారు. ఎవరికి వారు తమ డిమాండ్ల మీద పట్టుదలగా ఉండటంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యింది. ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ జరిపినప్పటికీ ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోయారు. వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి తప్పించి ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. పైపెచ్చు ఇంకా జఠిలం చేశారు.
ఇప్పుడు చిరంజీవి ఇరు వర్గాల మధ్య ఎలాంటి సంధి కుదురుస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిర్మాతలేమో స్లాట్ల ప్రతిపాదన మీదే ధృడంగా ఉన్నారు. రోజుకు రెండు వేల రూపాయలు తీసుకునేవాళ్ళకు ఒక శాతం, వెయ్యి రూపాయలలోపు అందుకునే కార్మికులకు ఇంకో శాతం లాంటి కండీషన్లు ఫెడరేషన్ ముందు పెట్టారు. కానీ వాళ్లేమో దీనికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. గతంలో రాసుకున్న అగ్రిమెంట్లలో రెండు నిబంధనలు ఇప్పటికీ ఫెడరేషన్ పాటించడం లేదని ప్రొడ్యూసర్ల కంప్లయింట్. ఎప్పటి నుంచో అడుగుతున్నా పెంపు ఊసే లేకుండా పనులు చేయించుకుంటున్నారని ఫెడరేషన్ వాదన.
ఎంత పెద్దరికం తీసుకున్నా ఇది పరిష్కరించడం చిరంజీవికి అంత సులభమైతే కాబోదు. కాకపోతే ముందస్తు ప్రిపరేషన్ లో భాగంగా తనకు బాగా సన్నిహితులైన నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధుల నుంచి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకుని దాన్ని విశ్లేషించే పనిలో పడ్డారట. రేపు తన దగ్గరికి వచ్చినప్పుడు సహేతుకమైన వాదనలు, ప్రతిపాదనలు, సమాధానాలు ఉండేలా ప్రిపేరవుతున్నారని మెగా కాంపౌండ్ టాక్. ఇప్పుడీ రాయబారంలో చిరు విజయం సాధిస్తే అంతకన్నా ఇండస్ట్రీ కోరుకునేది ఏమి ఉండదు. ఇప్పటికే షూటింగుల బందు వల్ల లక్షల నష్టం క్రమంగా కోట్లకు చేరుకునే ప్రమాదం మొదలయ్యింది.
This post was last modified on August 16, 2025 10:09 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…