గత రెండు వారాలుగా ఇండస్ట్రీని కుదిపేసి ఎక్కడిక్కడ షూటింగులను ఆపేసిన ఫెడరేషన్ సమ్మె వివాదం రేపు పరిష్కారం కోసం చిరంజీవి ఇంటికి చేరనుందని ఫిలిం నగర్ అప్డేట్. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, కార్మిక నాయకులు మెగాస్టార్ సమక్షంలో దీని గురించి చర్చించబోతున్నారు. ఎవరికి వారు తమ డిమాండ్ల మీద పట్టుదలగా ఉండటంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యింది. ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ జరిపినప్పటికీ ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోయారు. వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి తప్పించి ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. పైపెచ్చు ఇంకా జఠిలం చేశారు.
ఇప్పుడు చిరంజీవి ఇరు వర్గాల మధ్య ఎలాంటి సంధి కుదురుస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిర్మాతలేమో స్లాట్ల ప్రతిపాదన మీదే ధృడంగా ఉన్నారు. రోజుకు రెండు వేల రూపాయలు తీసుకునేవాళ్ళకు ఒక శాతం, వెయ్యి రూపాయలలోపు అందుకునే కార్మికులకు ఇంకో శాతం లాంటి కండీషన్లు ఫెడరేషన్ ముందు పెట్టారు. కానీ వాళ్లేమో దీనికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. గతంలో రాసుకున్న అగ్రిమెంట్లలో రెండు నిబంధనలు ఇప్పటికీ ఫెడరేషన్ పాటించడం లేదని ప్రొడ్యూసర్ల కంప్లయింట్. ఎప్పటి నుంచో అడుగుతున్నా పెంపు ఊసే లేకుండా పనులు చేయించుకుంటున్నారని ఫెడరేషన్ వాదన.
ఎంత పెద్దరికం తీసుకున్నా ఇది పరిష్కరించడం చిరంజీవికి అంత సులభమైతే కాబోదు. కాకపోతే ముందస్తు ప్రిపరేషన్ లో భాగంగా తనకు బాగా సన్నిహితులైన నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధుల నుంచి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకుని దాన్ని విశ్లేషించే పనిలో పడ్డారట. రేపు తన దగ్గరికి వచ్చినప్పుడు సహేతుకమైన వాదనలు, ప్రతిపాదనలు, సమాధానాలు ఉండేలా ప్రిపేరవుతున్నారని మెగా కాంపౌండ్ టాక్. ఇప్పుడీ రాయబారంలో చిరు విజయం సాధిస్తే అంతకన్నా ఇండస్ట్రీ కోరుకునేది ఏమి ఉండదు. ఇప్పటికే షూటింగుల బందు వల్ల లక్షల నష్టం క్రమంగా కోట్లకు చేరుకునే ప్రమాదం మొదలయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…