చాలా మాములు సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెడతాడని అనిరుధ్ రవిచందర్ కు పేరు. జైలర్, దేవరలో దాన్ని నిజం చేసి చూపించాడు. రజనీకాంత్ ఊరికే నడుచుకుంటూ వచ్చే సీన్లను బీజీఎమ్ తో అదరగొట్టిన వైనం రిపీట్ ఆడియన్స్ ని తీసుకొచ్చింది. సెకండాఫ్ లో బలహీనతలున్న దేవర సైతం ఈ పాజిటివ్ ఫ్యాక్టర్ వల్లే నెగటివిటీని తట్టుకుని నిలబడింది. అలాంటి అనిరుధ్ ఇప్పుడు తడబడుతున్నాడు. వరసగా నాలుగు సినిమాలు తన పనితనానికి, తీసుకుంటున్న భారీ పారితోషికానికి మధ్య బ్యాలన్స్ ని ప్రశ్నిస్తున్నాయి. ఈ సమస్య గత ఏడాది విడుదలైన ‘వెట్టయన్’ నుంచి మొదలయ్యింది.
అందులో అనిరుధ్ మార్క్ అస్సలు కనిపించలేదు. సినిమా పెద్దగా ఏం లేదనే సంగతి పక్కనపెడితే మరీ బ్యాడ్ మూవీ అయితే కాదు. అయినా సరే బక్కోడి మేజిక్ పని చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఆ తర్వాత అజిత్ ‘విడాముయార్చి’ మరో చేదు అనుభవం. కంటెంట్ తేడాగా ఉన్నప్పటికీ అనిరుద్ స్టైల్ లో బిజిఎం, పాట ఏదీ పెద్దగా ప్రభావం చూపించలేదు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ విషయంలోనూ ఊరికే ఊదరగొట్టడం తప్పించి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆల్బమ్, గుర్తు చేసుకునే నేపధ్య సంగీతం కానీ ఇవ్వలేదు. తాజాగా ‘కూలి’లోనూ మౌనిక మౌనిక తప్ప రజని ఇంట్రో సాంగ్ సైతం తేలిపోయింది.
అక్కడక్కడా తప్పించి అనిరుధ్ మార్క్ వినిపించలేదు. ఉన్నంతలో మంచి స్కోర్ ఇచ్చాడనే కామెంట్స్ ఉన్నాయి కానీ తన స్థాయి పనితనం కాదనే ,మాటను కొట్టిపారేయలేం. ఇతను చేస్తున్న సినిమాల్లో సెప్టెంబర్ 5 రిలీజ్ కానున్న శివ కార్తికేయన్ ‘మదరాసి’ ఉంది. దీంతో కంబ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. నెక్స్ట్ రాబోతున్న వాటిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మేజిక్, జన నాయగన్, ది ప్యారడైజ్, జైలర్ 2 చేతిలో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కింగ్ కూడా తనకే ఇచ్చారు. వీటితో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనేది మ్యూజిక్ లవర్స్ డిమాండ్. కొంచెం హడావిడి తగ్గించి కంపోజింగ్ మీద ఎక్కువ దృష్టి పెడితే అదేం కష్టం కాదు.
This post was last modified on August 16, 2025 6:07 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…