ఢిల్లీ హైకోర్టు నగరంలో కుక్కల జాడ కనిపించడానికి వీల్లేదని, నిర్ణీత గడువు లోగా వాటిని షెల్టర్స్ కు తరలించాలని తీర్పు ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పలువురు సెలబ్రిటీలు ఈ చర్యను ఖండిస్తున్నారు. జయం హీరోయిన్ సదా ఏకంగా భోరున కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో విడుదల చేయగా జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్ తదితరులు సామజిక మాధ్యమాల ద్వారా న్యాయస్థానం తీర్పుకి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ జంతు ప్రేమ అర్థం చేసుకోదగినదే అయినా నెటిజెన్లు వాస్తవిక కోణంలో లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
సినీ తారలు మద్దతు ఇస్తున్న వీధి కుక్కల వల్ల నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న పిల్లలు, వృద్ధులు, స్త్రీల సంఖ్య లక్షల్లో ఉంటోంది. కొందరు రేబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా ఎందరో మానసిక సమస్యలతో పిచ్చోళ్లలా బ్రతుకుతున్నారు. ఈ రోజుకీ అర్ధరాత్రి దాటితే ఎన్నో నగరాలు, పట్టణాల్లో హఠాత్తుగా మనుషుల మీద దాడి చేసే కుక్కల వందలు వేలల్లో ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఈ బెడద తీవ్రంగా ఉంది. ఒక్క ఢిల్లీలోనే ఆరు లక్షల కుక్కలు ఉన్నట్టు ఒక అంచనా. సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కోర్టు అలాంటి జడ్జ్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ముగ్గురు జడ్జీలతో దీన్ని మళ్ళీ పునఃసమీక్షించి కొత్త తీర్పు వెలువరించే అవకాశముందని ఢిల్లీ మీడియా రిపోర్ట్.
ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలు ఎవరూ రాత్రి పూట టూ వీలర్స్ మీద వెళ్లడం కానీ, నడుచుకుంటూ వీధుల్లో తిరగడం కానీ చేయరు. ఇంట్లో ఎక్కిన కారు మళ్ళీ గమ్యస్థానం చేరుకున్నాకే దిగుతారు. విమానాలు, ఖరీదయిన వాహనాల్లో తిరిగే వీళ్లకు సగటు మనుషులు తింటున్న కుక్క కాట్లు రుచి చూసి ఉండరు. ఇంట్లో లక్షలు ఖరీదు చేసే ఫారిన్ బ్రీడ్లను పెంచుకుంటారు కానీ వీధి కుక్కలను తెచ్చి పెంచుకోరు. ఇవి నెటిజెన్ల అడుగుతున్న లాజిక్కులు. ప్రభుత్వాల బాధ్యత కుక్కల పట్ల ఎంత ఉన్నా జంతువులు మనుషుల కంటే ఖచ్చితంగా విలువైనవి కాదు. ఆ కోణంలో ఆలోచిస్తే వాస్తవాలు అర్థమవుతాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…