Movie News

పవన్ కళ్యాణ్ చొరవ చాలా అవసరం

నిన్న టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసింది. అందరూ అనుకున్నట్టు ఇది ఫెడరేషన్ సమ్మె గురించి కాదు. తాజా పరిణామాలతో పాటు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం ఏర్పాటు చేయమని అడిగేందుకు టాప్ ప్రొడ్యూసర్లు అమరావతికి వెళ్లారు. ప్రత్యేక ఎజెండా ఏమి లేకపోయినా వర్తమానంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు అంశాల గురించి ఇందులో చర్చించుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగానే ఈ భేటీ జరగ్గా పలు కీలకమైన విషయాల గురించి కూలంకుషంగా మాట్లాడుకున్నారట.

తెలంగాణలో ఇటీవలే గద్దర్ అవార్డులు ప్రకటించి వాటిని విజేతలకు అందజేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా నంది అవార్డులను తిరిగి మొదలుపెట్టాలనే ప్రతిపాదన పలు సందర్భాల్లో వచ్చింది. ఉమ్మడిగా ఇవ్వాలా లేక విడిగా నిర్వహించాలా అనే దాని గురించి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయట. అమరావతి ప్రాంతంలో స్టూడియోలు, ఫిలిం సిటీల నిర్మాణానికి కావాల్సిన స్థలాలు, వనరుల గురించి దుర్గేష్, నిర్మాతల మధ్య డిస్కషన్ జరిగింది. టికెట్ రేట్లకు సంబంధించి ఒక స్థిరమైన వ్యవస్థ తీసుకురావాలనే ప్రతిపాదన మీటింగ్ లో వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సినిమా వాడిగా తమ సమస్యలు బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే వెంటనే సిఎం కలవలేకపోయామని చెప్పిన నిర్మాత నాగవంశీ త్వరలోనే చంద్రబాబునాయుడుని కలిసి తమ పరిస్థితులు వివరిస్తామని అన్నారు. సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఏర్పాటు చేసేలా కందుల దుర్గేష్ నుంచి హామీ వచ్చిందని మీడియా టాక్. నిజానికి రెండు నెలల క్రితం ప్లాన్ చేసుకున్న ఈ సమావేశం వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు నిన్న కుదిరింది. అయితే చంద్రబాబు, పవన్ తో జరగబోయే భేటీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. ఏపీలో పరిశ్రమ అడుగుకు పునాది వేయనుంది. దీనికి చొరవ తీసుకునేది పవన్ కల్యాణే.

This post was last modified on August 12, 2025 12:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Tollywood

Recent Posts

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

38 minutes ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

1 hour ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

4 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

5 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

8 hours ago

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

10 hours ago