నిన్న టాలీవుడ్ నిర్మాతల బృందం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసింది. అందరూ అనుకున్నట్టు ఇది ఫెడరేషన్ సమ్మె గురించి కాదు. తాజా పరిణామాలతో పాటు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం ఏర్పాటు చేయమని అడిగేందుకు టాప్ ప్రొడ్యూసర్లు అమరావతికి వెళ్లారు. ప్రత్యేక ఎజెండా ఏమి లేకపోయినా వర్తమానంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు అంశాల గురించి ఇందులో చర్చించుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగానే ఈ భేటీ జరగ్గా పలు కీలకమైన విషయాల గురించి కూలంకుషంగా మాట్లాడుకున్నారట.
తెలంగాణలో ఇటీవలే గద్దర్ అవార్డులు ప్రకటించి వాటిని విజేతలకు అందజేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా నంది అవార్డులను తిరిగి మొదలుపెట్టాలనే ప్రతిపాదన పలు సందర్భాల్లో వచ్చింది. ఉమ్మడిగా ఇవ్వాలా లేక విడిగా నిర్వహించాలా అనే దాని గురించి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయట. అమరావతి ప్రాంతంలో స్టూడియోలు, ఫిలిం సిటీల నిర్మాణానికి కావాల్సిన స్థలాలు, వనరుల గురించి దుర్గేష్, నిర్మాతల మధ్య డిస్కషన్ జరిగింది. టికెట్ రేట్లకు సంబంధించి ఒక స్థిరమైన వ్యవస్థ తీసుకురావాలనే ప్రతిపాదన మీటింగ్ లో వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సినిమా వాడిగా తమ సమస్యలు బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే వెంటనే సిఎం కలవలేకపోయామని చెప్పిన నిర్మాత నాగవంశీ త్వరలోనే చంద్రబాబునాయుడుని కలిసి తమ పరిస్థితులు వివరిస్తామని అన్నారు. సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఏర్పాటు చేసేలా కందుల దుర్గేష్ నుంచి హామీ వచ్చిందని మీడియా టాక్. నిజానికి రెండు నెలల క్రితం ప్లాన్ చేసుకున్న ఈ సమావేశం వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు నిన్న కుదిరింది. అయితే చంద్రబాబు, పవన్ తో జరగబోయే భేటీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. ఏపీలో పరిశ్రమ అడుగుకు పునాది వేయనుంది. దీనికి చొరవ తీసుకునేది పవన్ కల్యాణే.
This post was last modified on August 12, 2025 12:00 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…