ఫిలిం ఫెడరేషన్ 30 శాతం పెంపు కోరుతూ సమ్మెకు పిలుపు ఇవ్వడం, దానికి ఫిలిం ఛాంబర్ స్పందించి స్లాట్ల విధానాన్ని ప్రతిపాదించడం, దానికి తిరస్కారం ఎదురవ్వడం, తదితర పరిణామాలు సోమవారం నుంచి ఏకంగా షూటింగుల బందుకు తీసుకెళ్లాయి. పెంపుకి ఒప్పుకున్న నిర్మాతలు సైతం ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఛాంబర్ పెద్దలు పట్టుదలగా ఉండటంతో అందరూ ఏకీభావంతో ఉన్నారు. అటుపక్క ఫెడరేషన్ సైతం మంకుపట్టు వీడటం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో టాలీవుడ్ రోడ్ బ్లాక్ అయిపోయింది. బయటికి దారి తెలియడం లేదు.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఒక బృందం, తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మరో టీమ్ కలిసి సమస్యలు విన్నవించుకున్నా ఎలాంటి హామీ లభించలేదనేది ఇప్పటికి ఉన్న సమాచారం. ఇద్దరు మంత్రులు ఫెడరేషన్, ఛాంబర్ కలిసి సామరస్యంగా కమిటీలు వేసుకొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని సంకేతాలు ఇవ్వడంతో బాల్ కాస్తా ప్రొడ్యూసర్లు, వర్కర్ల చేతికి వచ్చింది. షూటింగులు ఆపేయడం భావ్యం కాదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. మధ్యలో పెద్దగా వ్యవహరించి దీన్నో కొలిక్కి తీసుకొద్దామనే చొరవ సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఎవరూ పెద్దగా చూపకపోవడంతో ప్రాబ్లమ్ మరింత జఠిలంగా మారింది.
ఇప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ రిలీజులు ఒత్తిడిలో దిగిపోయాయి. విడుదల తేదీలను చేరుకోవాలంటే ఇప్పుడు షూటింగులు ఆగకూడదు. ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ దొరకవు. చేతిలో ఉన్న బడ్జెట్ అయిపోవచ్చు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఛాంబర్ పెద్దలు శతవిధాలుగా దీన్ని సాల్వ్ చేసేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు కానీ సొల్యూషన్ ఎలా దొరుకుతుందో అర్థం కాక తల పట్టేసుకుంటున్నారు.. ఇరు వర్గాలు ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయితే తప్ప ఇది కొలిక్కి రావడం కష్టం. అప్పటిదాకా ఎదురు చూడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు.
This post was last modified on August 12, 2025 11:32 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…