ఫిలిం ఫెడరేషన్ 30 శాతం పెంపు కోరుతూ సమ్మెకు పిలుపు ఇవ్వడం, దానికి ఫిలిం ఛాంబర్ స్పందించి స్లాట్ల విధానాన్ని ప్రతిపాదించడం, దానికి తిరస్కారం ఎదురవ్వడం, తదితర పరిణామాలు సోమవారం నుంచి ఏకంగా షూటింగుల బందుకు తీసుకెళ్లాయి. పెంపుకి ఒప్పుకున్న నిర్మాతలు సైతం ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఛాంబర్ పెద్దలు పట్టుదలగా ఉండటంతో అందరూ ఏకీభావంతో ఉన్నారు. అటుపక్క ఫెడరేషన్ సైతం మంకుపట్టు వీడటం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో టాలీవుడ్ రోడ్ బ్లాక్ అయిపోయింది. బయటికి దారి తెలియడం లేదు.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఒక బృందం, తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మరో టీమ్ కలిసి సమస్యలు విన్నవించుకున్నా ఎలాంటి హామీ లభించలేదనేది ఇప్పటికి ఉన్న సమాచారం. ఇద్దరు మంత్రులు ఫెడరేషన్, ఛాంబర్ కలిసి సామరస్యంగా కమిటీలు వేసుకొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని సంకేతాలు ఇవ్వడంతో బాల్ కాస్తా ప్రొడ్యూసర్లు, వర్కర్ల చేతికి వచ్చింది. షూటింగులు ఆపేయడం భావ్యం కాదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. మధ్యలో పెద్దగా వ్యవహరించి దీన్నో కొలిక్కి తీసుకొద్దామనే చొరవ సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఎవరూ పెద్దగా చూపకపోవడంతో ప్రాబ్లమ్ మరింత జఠిలంగా మారింది.
ఇప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ రిలీజులు ఒత్తిడిలో దిగిపోయాయి. విడుదల తేదీలను చేరుకోవాలంటే ఇప్పుడు షూటింగులు ఆగకూడదు. ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ దొరకవు. చేతిలో ఉన్న బడ్జెట్ అయిపోవచ్చు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఛాంబర్ పెద్దలు శతవిధాలుగా దీన్ని సాల్వ్ చేసేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు కానీ సొల్యూషన్ ఎలా దొరుకుతుందో అర్థం కాక తల పట్టేసుకుంటున్నారు.. ఇరు వర్గాలు ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయితే తప్ప ఇది కొలిక్కి రావడం కష్టం. అప్పటిదాకా ఎదురు చూడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు.
This post was last modified on August 12, 2025 11:32 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…