ఫిలిం ఫెడరేషన్ 30 శాతం పెంపు కోరుతూ సమ్మెకు పిలుపు ఇవ్వడం, దానికి ఫిలిం ఛాంబర్ స్పందించి స్లాట్ల విధానాన్ని ప్రతిపాదించడం, దానికి తిరస్కారం ఎదురవ్వడం, తదితర పరిణామాలు సోమవారం నుంచి ఏకంగా షూటింగుల బందుకు తీసుకెళ్లాయి. పెంపుకి ఒప్పుకున్న నిర్మాతలు సైతం ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఛాంబర్ పెద్దలు పట్టుదలగా ఉండటంతో అందరూ ఏకీభావంతో ఉన్నారు. అటుపక్క ఫెడరేషన్ సైతం మంకుపట్టు వీడటం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో టాలీవుడ్ రోడ్ బ్లాక్ అయిపోయింది. బయటికి దారి తెలియడం లేదు.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఒక బృందం, తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మరో టీమ్ కలిసి సమస్యలు విన్నవించుకున్నా ఎలాంటి హామీ లభించలేదనేది ఇప్పటికి ఉన్న సమాచారం. ఇద్దరు మంత్రులు ఫెడరేషన్, ఛాంబర్ కలిసి సామరస్యంగా కమిటీలు వేసుకొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని సంకేతాలు ఇవ్వడంతో బాల్ కాస్తా ప్రొడ్యూసర్లు, వర్కర్ల చేతికి వచ్చింది. షూటింగులు ఆపేయడం భావ్యం కాదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. మధ్యలో పెద్దగా వ్యవహరించి దీన్నో కొలిక్కి తీసుకొద్దామనే చొరవ సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఎవరూ పెద్దగా చూపకపోవడంతో ప్రాబ్లమ్ మరింత జఠిలంగా మారింది.
ఇప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ రిలీజులు ఒత్తిడిలో దిగిపోయాయి. విడుదల తేదీలను చేరుకోవాలంటే ఇప్పుడు షూటింగులు ఆగకూడదు. ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ దొరకవు. చేతిలో ఉన్న బడ్జెట్ అయిపోవచ్చు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఛాంబర్ పెద్దలు శతవిధాలుగా దీన్ని సాల్వ్ చేసేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు కానీ సొల్యూషన్ ఎలా దొరుకుతుందో అర్థం కాక తల పట్టేసుకుంటున్నారు.. ఇరు వర్గాలు ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయితే తప్ప ఇది కొలిక్కి రావడం కష్టం. అప్పటిదాకా ఎదురు చూడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు.
This post was last modified on August 12, 2025 11:32 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…