ఫిలిం ఫెడరేషన్ 30 శాతం పెంపు కోరుతూ సమ్మెకు పిలుపు ఇవ్వడం, దానికి ఫిలిం ఛాంబర్ స్పందించి స్లాట్ల విధానాన్ని ప్రతిపాదించడం, దానికి తిరస్కారం ఎదురవ్వడం, తదితర పరిణామాలు సోమవారం నుంచి ఏకంగా షూటింగుల బందుకు తీసుకెళ్లాయి. పెంపుకి ఒప్పుకున్న నిర్మాతలు సైతం ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఛాంబర్ పెద్దలు పట్టుదలగా ఉండటంతో అందరూ ఏకీభావంతో ఉన్నారు. అటుపక్క ఫెడరేషన్ సైతం మంకుపట్టు వీడటం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తరహాలో టాలీవుడ్ రోడ్ బ్లాక్ అయిపోయింది. బయటికి దారి తెలియడం లేదు.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఒక బృందం, తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మరో టీమ్ కలిసి సమస్యలు విన్నవించుకున్నా ఎలాంటి హామీ లభించలేదనేది ఇప్పటికి ఉన్న సమాచారం. ఇద్దరు మంత్రులు ఫెడరేషన్, ఛాంబర్ కలిసి సామరస్యంగా కమిటీలు వేసుకొని మాట్లాడుకుని పరిష్కరించుకోండి అని సంకేతాలు ఇవ్వడంతో బాల్ కాస్తా ప్రొడ్యూసర్లు, వర్కర్ల చేతికి వచ్చింది. షూటింగులు ఆపేయడం భావ్యం కాదని ఈ సందర్భంగా కోమటిరెడ్డి పేర్కొన్నారు. మధ్యలో పెద్దగా వ్యవహరించి దీన్నో కొలిక్కి తీసుకొద్దామనే చొరవ సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఎవరూ పెద్దగా చూపకపోవడంతో ప్రాబ్లమ్ మరింత జఠిలంగా మారింది.
ఇప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ రిలీజులు ఒత్తిడిలో దిగిపోయాయి. విడుదల తేదీలను చేరుకోవాలంటే ఇప్పుడు షూటింగులు ఆగకూడదు. ఆర్టిస్టుల డేట్లు మళ్ళీ దొరకవు. చేతిలో ఉన్న బడ్జెట్ అయిపోవచ్చు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఛాంబర్ పెద్దలు శతవిధాలుగా దీన్ని సాల్వ్ చేసేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు కానీ సొల్యూషన్ ఎలా దొరుకుతుందో అర్థం కాక తల పట్టేసుకుంటున్నారు.. ఇరు వర్గాలు ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయితే తప్ప ఇది కొలిక్కి రావడం కష్టం. అప్పటిదాకా ఎదురు చూడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…