మన దేశంలో ఎంతోమంది ప్రముఖులు సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కానీ వాళ్లలో సోనూ సూద్ చాలా ప్రత్యేకం. ఒక పరిమితి అని పెట్టుకోకుండా.. ఇక చాలు అనుకోకుండా అతను లాక్ డౌన్ టైం నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండటం.. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేలా భారీ ప్రణాళికలతో వెళ్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
కొందరు అతడి సేవా కార్యక్రమాలపై సందేహాలు వ్యక్తం చేసినా, దురుద్దేశాలు ఆపాదించినా అతను వెనకడుగు వేయట్లేదు. ఇంతగా అతను స్పందించడానికి ఏం పురిగొల్పిందన్నది జనాలకు అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు సోనూ సూద్. తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారమే తాను ఈ రోజు ఇంతమందికి సాయ పడుతున్నట్లు సోనూ వెల్లడించాడు.
2008లో తన తల్లిని, 2016లో తన తండ్రిని కోల్పోయినట్లు సోనూ వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు ఓ ఇంటర్వ్యూలో. తమ కుటుంబ స్వస్థలం పంజాబ్లోని మోగా అని వెల్లడించిన సోనూ.. తన తల్లిదండ్రులు బతికుండగా ‘ఏదో ఒక రోజు మీ బిడ్డ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేలా చేస్తా’ అని మాట ఇచ్చానని.. వాళ్లు ఆ రోజు ఇచ్చిన ఆశీర్వాద ఫలితంగానే తాను అంతా చేయగలిగానని, ఈ రోజు ఇంతమంది ప్రేమాభిమానాలు పొందుతున్నానని సోనూ తెలిపాడు.
కేంద్ర ఎన్నికల సంఘం.. సోనూను ఇటీవల పంజాబ్ ఎన్నికల ఐకాన్గా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ ఈ విషయాలు మాట్లాడాడు. తనుకు ఇచ్చిన గుర్తింపు పెద్ద బాధ్యత అని.. ఇప్పుడు తన తల్లిదండ్రులు తనను చూసి ఎంతో సంతోషిస్తుంటారని భావోద్వేగానికి గురయ్యాడు సోనూ. ప్రజల ప్రేమ, నమ్మకాన్ని మోసేంత శక్తి తనకు ఎక్కడి నుంచి వస్తోందో తెలియడం లేదని.. తనలో బలం, ధైర్యం ఉన్నంత కాలం ఎలాంటి బాధ్యతనైనా మోస్తానని సోనూ వ్యాఖ్యానించాడు.
This post was last modified on November 19, 2020 7:33 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…