మన దేశంలో ఎంతోమంది ప్రముఖులు సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. కానీ వాళ్లలో సోనూ సూద్ చాలా ప్రత్యేకం. ఒక పరిమితి అని పెట్టుకోకుండా.. ఇక చాలు అనుకోకుండా అతను లాక్ డౌన్ టైం నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండటం.. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేలా భారీ ప్రణాళికలతో వెళ్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
కొందరు అతడి సేవా కార్యక్రమాలపై సందేహాలు వ్యక్తం చేసినా, దురుద్దేశాలు ఆపాదించినా అతను వెనకడుగు వేయట్లేదు. ఇంతగా అతను స్పందించడానికి ఏం పురిగొల్పిందన్నది జనాలకు అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు సోనూ సూద్. తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారమే తాను ఈ రోజు ఇంతమందికి సాయ పడుతున్నట్లు సోనూ వెల్లడించాడు.
2008లో తన తల్లిని, 2016లో తన తండ్రిని కోల్పోయినట్లు సోనూ వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు ఓ ఇంటర్వ్యూలో. తమ కుటుంబ స్వస్థలం పంజాబ్లోని మోగా అని వెల్లడించిన సోనూ.. తన తల్లిదండ్రులు బతికుండగా ‘ఏదో ఒక రోజు మీ బిడ్డ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేలా చేస్తా’ అని మాట ఇచ్చానని.. వాళ్లు ఆ రోజు ఇచ్చిన ఆశీర్వాద ఫలితంగానే తాను అంతా చేయగలిగానని, ఈ రోజు ఇంతమంది ప్రేమాభిమానాలు పొందుతున్నానని సోనూ తెలిపాడు.
కేంద్ర ఎన్నికల సంఘం.. సోనూను ఇటీవల పంజాబ్ ఎన్నికల ఐకాన్గా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ ఈ విషయాలు మాట్లాడాడు. తనుకు ఇచ్చిన గుర్తింపు పెద్ద బాధ్యత అని.. ఇప్పుడు తన తల్లిదండ్రులు తనను చూసి ఎంతో సంతోషిస్తుంటారని భావోద్వేగానికి గురయ్యాడు సోనూ. ప్రజల ప్రేమ, నమ్మకాన్ని మోసేంత శక్తి తనకు ఎక్కడి నుంచి వస్తోందో తెలియడం లేదని.. తనలో బలం, ధైర్యం ఉన్నంత కాలం ఎలాంటి బాధ్యతనైనా మోస్తానని సోనూ వ్యాఖ్యానించాడు.
This post was last modified on November 19, 2020 7:33 pm
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…