కెమెరా ముందుకు వెళ్లబోతున్నా అనగానే మెగాస్టార్ చిరంజీవిలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందో ఏమో.. అందుకోసం ఆయన సన్నద్ధమయ్యే తీరే ప్రత్యేకంగా ఉంటుంది. రాజకీయాలు, ఇతర వ్యవహారాల వల్ల పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు.. ఆ సమయంలో తన లుక్ గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు కొన్ని నెలల్లోనే ఆయన తన లుక్ను పూర్తిగా మార్చుకున్నారు. ఆ సినిమాలో అమేజింగ్ లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
పదేళ్ల పాటు చిరు సినిమాలకు దూరంగా ఉన్న ఫీలింగ్ ఎంతమాత్రం కలగలేదు. చివరగా ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఎంత ఆకర్షణీయంగా కనిపించారో.. రీఎంట్రీ మూవీలో అంతే అట్రాక్టివ్గా కనిపించారు. మధ్యలో ‘సైరా’ కోసం లుక్ మార్చుకుని విభిన్నంగా కనిపించిన చిరు.. మళ్లీ ‘ఆచార్య’ కోసం అవతారం మార్చుకున్నారు.
ఆ మధ్య రిలీజైన ‘ఆచార్య’ ఫస్ట్ లుక్లో చిరును చూసి కొందరికి సాయిధరమ్ తేజ్ గుర్తుకొచ్చాడు. అంతగా చిరు ఫిజిక్లో మార్పు వచ్చింది. ఐతే లాక్ డౌన్ టైంలో షూటింగ్ లేక చిరు ఖాళీ అయిపోయాడు. మధ్య మధ్యలో ఆయన లుక్ తేడా కొడుతున్నట్లు కనిపించింది. కానీ షూటింగ్ మళ్లీ మొదలు కాబోతోందనగానే చిరులో మళ్లీ మార్పు వచ్చేసింది. కష్టపడి ఒకప్పటి లుక్లోకి వచ్చేశారు.
తాజాగా సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న టాక్ షో ‘సామ్ జామ్’కు అతిథిగా వచ్చిన సందర్భంగా చిరు చేసిన ఫొటో షూట్ తాలూకు పిక్స్ బయటికి వచ్చాయి. అందులో చిరును చూసి అందరూ షాకైపోయారు. టాప్ టు బాటమ్ ఆయనలో ఒక ఆకర్షణ కనిపిస్తోంది. ముఖంలో తేజస్సు చూసి అందరూ షాక్. ఓవరాల్గా లుక్ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ అందరిలోనూ వచ్చింది. కెమెరా అంటే చిరులో ఎంత ఉత్సాహం వస్తుందో.. ఎలా లుక్ను ఆకర్షణీయంగా మార్చుకుంటారో మరోసారి రుజువైంది.
This post was last modified on November 19, 2020 7:21 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…