కెమెరా ముందుకు వెళ్లబోతున్నా అనగానే మెగాస్టార్ చిరంజీవిలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుందో ఏమో.. అందుకోసం ఆయన సన్నద్ధమయ్యే తీరే ప్రత్యేకంగా ఉంటుంది. రాజకీయాలు, ఇతర వ్యవహారాల వల్ల పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు.. ఆ సమయంలో తన లుక్ గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు కొన్ని నెలల్లోనే ఆయన తన లుక్ను పూర్తిగా మార్చుకున్నారు. ఆ సినిమాలో అమేజింగ్ లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
పదేళ్ల పాటు చిరు సినిమాలకు దూరంగా ఉన్న ఫీలింగ్ ఎంతమాత్రం కలగలేదు. చివరగా ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఎంత ఆకర్షణీయంగా కనిపించారో.. రీఎంట్రీ మూవీలో అంతే అట్రాక్టివ్గా కనిపించారు. మధ్యలో ‘సైరా’ కోసం లుక్ మార్చుకుని విభిన్నంగా కనిపించిన చిరు.. మళ్లీ ‘ఆచార్య’ కోసం అవతారం మార్చుకున్నారు.
ఆ మధ్య రిలీజైన ‘ఆచార్య’ ఫస్ట్ లుక్లో చిరును చూసి కొందరికి సాయిధరమ్ తేజ్ గుర్తుకొచ్చాడు. అంతగా చిరు ఫిజిక్లో మార్పు వచ్చింది. ఐతే లాక్ డౌన్ టైంలో షూటింగ్ లేక చిరు ఖాళీ అయిపోయాడు. మధ్య మధ్యలో ఆయన లుక్ తేడా కొడుతున్నట్లు కనిపించింది. కానీ షూటింగ్ మళ్లీ మొదలు కాబోతోందనగానే చిరులో మళ్లీ మార్పు వచ్చేసింది. కష్టపడి ఒకప్పటి లుక్లోకి వచ్చేశారు.
తాజాగా సమంత ‘ఆహా’ కోసం నిర్వహిస్తున్న టాక్ షో ‘సామ్ జామ్’కు అతిథిగా వచ్చిన సందర్భంగా చిరు చేసిన ఫొటో షూట్ తాలూకు పిక్స్ బయటికి వచ్చాయి. అందులో చిరును చూసి అందరూ షాకైపోయారు. టాప్ టు బాటమ్ ఆయనలో ఒక ఆకర్షణ కనిపిస్తోంది. ముఖంలో తేజస్సు చూసి అందరూ షాక్. ఓవరాల్గా లుక్ చాలా బాగుందనే ఫీడ్ బ్యాక్ అందరిలోనూ వచ్చింది. కెమెరా అంటే చిరులో ఎంత ఉత్సాహం వస్తుందో.. ఎలా లుక్ను ఆకర్షణీయంగా మార్చుకుంటారో మరోసారి రుజువైంది.
This post was last modified on November 19, 2020 7:21 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…