పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన దక్కించుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సచిన్ కేడ్కర్, బాబి డియోల్, సునీల్ వంటి ఎంతోమంది కీలక పాత్రల్లో నటించారు.
క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాను కేవలం యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కేవలం ఇది ఒక కమర్షియల్ సినిమా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే హరిహర వీరమల్లు ఆనాడు ధర్మంపై జరిగిన దాడి మాత్రమే కాదు, నేడు కొందరు నాయకులు చేస్తున్న, ప్రోత్సహిస్తున్న మత దాడులకు చెంపపెట్టుగా నిలుస్తోంది. ఎందుకంటే ఔరంగజేబు అప్పట్లో ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చు.
వాటిని అప్పటి ప్రభుత్వాలు ఫిల్టర్ చేసి కేవలం మంచిని మాత్రమే పాఠ్యపుస్తకాల్లో పెట్టి పిల్లల ముందుకు తీసుకు వచ్చాయి. కానీ అప్పట్లో చేసిన అరాచకాలు, అన్యాయాలను హరిహర వీరమల్లు సినిమా ద్వారా మరోసారి ప్రపంచం ముందుకు తీసుకువచ్చినట్లు అయింది. ఔరంగజేబు అహంకారానికి, ఆధిపత్య ధోరణికి ఎదురు నిలిచిన వీరమల్లు కథ కేవలం ఆయన ఒక్కడిదే కాదు, సనాతన ధర్మ పరిరక్షణకై పోరాడి కనుమరుగైన ఎంతోమంది యోధుల కథ. అలా చరిత్ర శోధించలేకపోయిన ఎందరో వీరులలో ఒకడైన వీరమల్లు కథ ప్రేక్షకులను ఇన్స్పైర్ చేస్తున్న తీరు అమోఘం.
హరిలా ఒకపక్క హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ, హరుడిలా శత్రుసంహారం చేసిన హరిహర వీరమల్లు, ఆబాల గోపాలాన్ని కట్టిపడేసేలా చేస్తుందని అభిమానులు అంటున్నారు. ప్రీమియర్స్తో మంచి స్టార్ట్ కనబరిచిన హరిహర వీరమల్లు చివరకు ఎంత వసూలు చేస్తదో చూడాలి.
This post was last modified on July 25, 2025 1:34 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…