ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితం అంత ఈజీగా.. సాఫీగా నడవలేదన్నారు. అనేక ఇబ్బందులు కష్టాలుపడ్డానని చెప్పారు. “నా జీవితం వడ్డించిన విస్తరి కాదు.” అని తెలిపారు. జీవితం అనే ప్రయాణంలో అనేక ఇబ్బందులు పడ్డానన్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తనేమీ ప్రశాంతంగా లేనని చెప్పారు. తాజాగా హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పటికీ.. తన సినిమాను విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు పడినట్టు చెప్పారు.
యాంటీ ప్రచారాన్ని జయించే శక్తి ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. “నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నా. రోజూ అనేక పంచాయతీలకు సంబంధించి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ, నా సినిమా(వీరమల్లు)నే నాకు పెద్ద పంచాయతీగా మారింది. ఈ సినిమా అంత సులువుగా విడుదల కాలేదు. అనేక రోజులు నిద్రలేని రాత్రులు కూడా గడిపాను.” అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు తనను కలిసినప్పుడు అనేక కోణాల్లో ఆలోచన చేయాల్సి వచ్చిందన్నారు.
చివరకు సీఎం చంద్రబాబు వద్దకు ఫైలు పంపించామని.. అందరూ కోరినట్టుగానే తాము కూడా కోరామని.. ప్రభుత్వంలో ఉన్నాం కదా.. అని ఎక్కువ, తక్కువలు చూపించలేదన్నారు. అయినా.. విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. “హరిహర వీరమల్లు సినిమాను బాయ్కాట్ చేయాలని కొందరు(వైసీపీ) పిలుపునిచ్చారు. కానీ, వారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. ఈ సినిమా మిమ్మల్ని అంతగా భయ పెట్టిందా?” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తన వరకు ఈ సినిమా బాగానే ఉందన్న ఆయన.. క్లయిమాక్స్ బాగుందనే టాక్ రావడం తనకు సంతృప్తినిచ్చిందని తెలిపారు.
This post was last modified on July 25, 2025 10:06 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…