పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్లో తొలిప్రేమ హీరోయిన్ అనగానే.. కీర్తి రెడ్డి ఆయనతో రీ యునైట్ అవుతోందా, ఇదేం చిత్రం అనిపించొచ్చు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆయనతో కలిసి నటిస్తున్నది 1998 ‘తొలి ప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి కాదు.. 2018లో వచ్చిన వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ కథానాయిక రాశి ఖన్నా. ఈ ఢిల్లీ భామ తొలిసారిగా పవన్ కళ్యాణ్తో జట్టు కడుతున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఇప్పుడా విషయం అధికారికం అయింది. పవన్ కొత్త చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఒక కథానాయికగా శ్రీలీల నటిస్తుండగా.. రెండో హీరోయిన్గా రాశిని సెలక్ట్ చేసింది చిత్ర బృందం. ఆమె ఈ సినిమాలో శ్లోక అనే పాత్రలో కనిపించనుంది.
మెడకు కెమెరా తగిలించుకుని స్కర్టుతో చాలా మోడర్న్గా కనిపిస్తున్న రాశి ఫస్ట్ లుక్ను ఈ రోజు చిత్ర బృందం రిలీజ్ చేసింది. రాశి తెలుగులో చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద హీరో సరసన నటిస్తున్న చిత్రమిది. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేసిన రాశికి.. అనుకోకుండా బ్రేక్ వచ్చింది. వరుస ఫ్లాపులతో ఆమె వెనుకబడిపోయింది. ఒక దశలో తెలుగులో సినిమాలే లేని పరిస్థితి వచ్చింది. ఐతే కొంత విరామం తర్వాత ఆమెకు సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుగు కదా’ చేసే అవకాశం వచ్చింది.
ఇప్పుడు ఏకంగా పవన్తో సినిమా చేసే ఛాన్స్ అందుకుంది రాశి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి రీమేక్ అని భావిస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య ఒరి ఇరిజినల్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమానే అంటూ ప్రచారం మొదలైంది. రీమేకే అయితే.. తమిళంలో సమంత, అమీ చేసిన పాత్రల్లో రాశి, శ్రీలీలల్లో ఎవరు ఏ పాత్రను చేస్తున్నారన్నది ఆసక్తికరం. ఒరిజినల్లో సమంతకే కీలక పాత్ర దక్కింది. ఆమెది నటనకు అవకాశమున్న పాత్ర. అనుభవం, యాక్టింగ్ టాలెంట్ ప్రకారం చూస్తే రాశికే ఆ పాత్ర దక్కాలి. మరి హరీష్ శంకర్ ఎవరిని ఈ పాత్రకు ఎంచుకున్నాడో చూడాలి. అసలింతకీ ఈ చిత్రం రీమేకా కాదా అన్నది పెద్ద సస్పెన్స్.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…