విడుదలకు ఇంకా ఏడాదికి పైగా టైం ఉండగానే బాలీవుడ్ విజువల్ గ్రాండియర్ రామాయణ సంచలనాలు నమోదు చేయడంలో బిజీగా ఉంది. ఇటీవలే రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లిమ్ప్స్ మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇంకా బిజినెస్ జరగకుండా, ఓటిటి అమ్మకుండానే వెయ్యి కోట్ల లాభం ఏమిటనుకుంటున్నారా. ఇక్కడో మతలబు ఉంది. అదేంటంటే రామాయణ నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ సంస్థ మార్కెట్ షేర్ ధర జూన్ 25 వరకు 113 రూపాయల 47 పైసలు ఉండేది. టీజర్ వచ్చాక జూలై 1 నాటికి 149 రూపాయలు 69 పైసలకు చేరింది. ప్రస్తుతం 169 రూపాయలకు చేరుకోవడం అనూహ్యం.
అంటే ప్రైమ్ ఫోకస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4638 కోట్ల నుంచి 5641 కోట్లకు చేరుకుంది అంటే వెయ్యి కోట్ల పెరుగుదల. ఇది రామాయణ ప్రభావమేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ పెరుగుదల గతంలో ఎప్పుడూ జరగలేదట. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ గ్రాండియర్ మీద ఆడియన్స్ లో పెరుగుతున్న నమ్మకం, భారీ క్యాస్టింగ్, రన్బీర్ కపూర్ – యాష్ – సాయిపల్లవి పేర్లు అంతకంతా అంచనాలు పెంచుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారికి రాజమౌళి అంత బ్రాండ్ లేకపోయినా బజ్ విషయంలో ఆయనకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ప్యాన్ ఇండియా క్రేజ్ వచ్చేస్తోంది.
ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సినిమా రిలీజయ్యే నాటికి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ట్రైలర్, ప్రమోషనల్ మెటీరియల్ బయటికి వచ్చే కొద్దీ షేర్ వేల్యూ మరింత పెరగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక సినిమా నిర్మాణం ఒక సంస్థ షేర్ మార్కెట్ మీద ఇంత సానుకూలంగా ప్రభావం చూపించడం అరుదు. రెండు భాగాలు ఏడాది గ్యాప్ లో 2026, 2027 దీపావళి పండగకు రిలీజ్ కాబోతున్నాయి. దీనికి కాంపిటీషన్ ఇచ్చే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఆదిపురుష్ తో రాముడి కథని సరిగా తీయలేదని తీవ్ర విమర్శలు ఎదురుకున్న బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు రామాయణ మీదే ఉన్నాయి.
This post was last modified on July 9, 2025 11:41 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…