ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు, అదేవిధంగా ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టే వారికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
అయితే, రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా నిలువరించేలా, పెట్టుబడులు పెట్టే వారిని బెదిరించేలా ప్రతిపక్ష వైసిపి నాయకులు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు కనిపించలేదు. దీంతో చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను ఆధారాలతో సహా బయటపెట్టారు.
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకునే లాగా వైసిపి తెర వెనుక కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర మైనింగ్ శాఖలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆహ్వానించామని. ఈ క్రమంలో మైనింగ్ శాఖపై కల్పిత ఆరోపణలతో వైసిపి కుట్ర పన్నిందని ఆయన చెప్పుకొచ్చారు. ఉదయ భాస్కర్ అనే వైసిపి అభిమానితో దాదాపు 200కు పైగా ఈ మెయిళ్లు.. పెట్టించి పెట్టుబడులను అడ్డుకున్నారని దీంతో 9 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు నిలిచిపోయాయని ఆయన చెప్పారు.
అదేవిధంగా వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని దీంతో పెట్టుబడులు పెట్టేవారు రాకుండా చూడాలన్నదే వారి ప్రధాన ఉద్దేశం గా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. 200 ఈ-మెయిళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని రాష్ట్ర అభివృద్ధి చెందేందుకు కుదిరితే కలిసి పని చేయాలని లేకపోతే మౌనంగా ఉండాలని సీరియస్ గా వ్యాఖ్యానించారు.
ఒకవైపు సోషల్ మీడియాలో, మరోవైపు ఈ మెయిల్ రూపంలో తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూనే మరోవైపు న్యాయస్థానాల్లోనూ పెట్టుబడులు రాకుండా పిటిషన్లు వేయిస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. అయినా తమ ప్రభుత్వం ముందుకే సాగుతుందని ఇటువంటి కుట్రలను కచ్చితంగా భగ్నం చేస్తామని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…