ఇప్పుడు జరుగుతున్నది బాగుంది కదా, టెన్షన్ ఎందుకనే ధోరణి పరిశ్రమలో బాగా పెరిగిపోయింది. దీని వల్ల క్వాలిటీ తగ్గిపోయి, ప్యాన్ ఇండియా మోజులో పడి విలువైన టైంని వృథా చేసుకోవడంతో పాటు దారుణమైన డిజాస్టర్లు చవి చూస్తున్న హీరోలు అంతకంతా పెరుగుతూ పోతున్నారు. దీనికి చిన్నా పెద్దా తేడా లేదు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ విషయంగా చెబుతున్న కొన్ని కఠిన వాస్తవాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. బాలీవుడ్ పతనాన్ని చూసి మనం జాగ్రత్త పడటం లేదని, మార్కెట్ కిందకు వెళ్లిపోవడాన్ని గుర్తించకపోతే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సూచన ఒక ఇంటర్వ్యూలో చేశారు.
ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే ఇదే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం రూపంలో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించారు. కానీ కేవలం ఆరు నెలల కాలంలో గేమ్ ఛేంజర్, తమ్ముడు రూపంలో తీవ్ర నష్టాలు తెచ్చిన సినిమాలు ఇచ్చారు. విక్రమ్ తో కమల్ హాసన్ కంబ్యాక్ అయ్యారు, ఇక తిరుగు లేదని భావించిన వారు ఇండియన్ 2, థగ్ లైఫ్ ఫలితాలు చూశాక మాట్లాడలేదు. కూలీ క్రేజ్ రజనీకాంత్ వల్ల వచ్చిందనుకుంటే మరి లాల్ సలామ్ కు కనీస ఓపెనింగ్స్ ఎందుకు రాలేదు. మెగా 157ని ఎగబడి కొనేందుకు నెలకొన్న ఓటిటి పోటీ విశ్వంభరకు కనిపించలేదు. ఇలా చెప్పుకుంటూ బోలెడు ఉదాహరణలు ప్రత్యక్ష సాక్షాలుగా నిలుస్తాయి.
బాలీవుడ్ ఒకప్పుడు గోల్డెన్ ఎరా చూసింది. మాస్, క్లాసు మెచ్చుకునే ఎన్నో గొప్ప క్లాసిక్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏడాది అయిదారు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడమే గగనమైపోయింది. హారర్ జానర్ మీద మితిమీరి ఆధారపడుతూ కామన్ ఆడియన్స్ ని పట్టించుకోవడం మానేశారు. దీని వల్ల కింది సెంటర్ల థియేటర్లలో జనాలు కనిపించడం తగ్గిపోయింది. మల్టీప్లెక్సులను నమ్ముకున్న నిర్మాతలు అన్నివేళలా పాజిటివ్ రిజల్ట్స్ అందుకోవడం లేదు. మనకూ అలాంటి స్థితి రాకూడదంటే కంటెంట్, క్వాలిటీ, బడ్జెట్ ఈ మూడు అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే దిల్ రాజు అన్నట్టు ఒకప్పుడు రోజులే బాగుండేవనే పరిస్థితి తలెత్తుతుంది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…