ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’ తెలుగులో మంచి ఫలితాన్నందుకుంది. రిలీజ్ ముంగిట పెద్దగా హైప్ లేకపోయినా.. తొలి రోజు చాలా మంచి టాక్ రావడంతో సినిమా పుంజుకుంది. తొలి వీకెండ్లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా డీసెంట్ రన్తో కొనసాగుతోంది. రెండో వీకెండ్లో కూడా ఈ చిత్రానికి తెలుగులో మంచి వసూళ్లే వచ్చాయి.
ఐతే ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకులు ఈ సినిమా గురించి చాలా వరకు పాజిటివ్గానే మాట్లాడారు కానీ.. సెకండాఫ్, క్లైమాక్స్ విషయంలో మాత్రం కొంతమేర విమర్శలు తప్పలేదు. సినిమా నిడివి ఎక్కువైందని.. ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఆశిస్తే, హీరో చేతిలో విలన్ చావడం అనే రొటీన్ క్లైమాక్స్తో కమ్ముల నిరాశపరిచాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శలపై శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
‘కుబేర’ క్లైమాక్స్ గురించి చాలా ఆలోచించాకే.. ఇప్పుడు సినిమాలో ఉన్నది ఖరారు చేశామని కమ్ముల తెలిపాడు.
విలన్ చాలా పవర్ ఫుల్ వ్యక్తి అని.. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి జైలుకు పంపించినా.. తనకున్న పవర్తో ఈ సిస్టంను మేనేజ్ చేసి అతను బయటికి వచ్చేస్తాడని.. ఆ స్థాయి వ్యక్తిని ఒక బిచ్చగాడు ఏమీ చేయలేడని కమ్ముల అభిప్రాయపడ్డాడు. అందుకే దేవా చేతిలో అతను చనిపోవడమే కరెక్ట్ అనిపించిందని చెప్పాడు.
మంచి జన్మ రావాలంటే కట్టలు వేసి కాల్చాలని దేవా ఎప్పుడు చెబుతూ ఉంటాడని.. అంత ధనవంతుడైన విలన్ చెత్త కుప్పలు కట్టెలు కూడా లేకుండా దిక్కులేని చావు చస్తాడని.. అది అతడికి సరైన శిక్ష అని.. ఇలా పొయెటిక్ స్టయిల్లో క్లైమాక్స్ డిజైన్ చేశామని కమ్ముల తెలిపాడు. ఇక సినిమా నిడివి ఎక్కువ ఉండడం గురించి శేఖర్ మాట్లాడుతూ.. రన్ టైం తగ్గించడానిక వీలైనంత ప్రయత్నించామని.. కానీ ఈ కథను ఇలా చెబితేనే కరెక్ట్ అని మూడు గంటల నిడివితో రిలీజ్ చేశామని.. అలా అని అంత నిడివి ఉంటే గొప్ప అనేమీ కాదని కమ్ముల చెప్పాడు.
This post was last modified on June 30, 2025 2:34 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…