Political News

అనూహ్యం..ఏపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ వీరే

ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఏ నేతలకు దక్కబోతోందని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏపీలో మరోసారి దగ్గుబాటి పురంధేశ్వరికే పగ్గాలు అప్పగించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో చిన్నమ్మకే మరో చాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై కమాండ్ నియమించింది. ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు పేరును ఎంపిక చేసింది.

ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రామచందర్ రావుకు ఈ పదవి దక్కడం విశేషం. ఈ పదవి ఆయనకు దక్కడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారట. ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కకుండా బీజేపీ సీనియర్ నాయకులు చెక్ పెట్టారట. బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన రామచందర్ రావుకు ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన సంబంధాలున్నాయి. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు బ్రాహ్మణ సమాజానికి చెందిన రామచందర్ రావు సరైన వ్యక్తి అని బీజేపీ హై కమాండ్, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు భావించారు.

ఇక, ఏపీ బీజేపీ చీఫ్ గా చిన్నమ్మ స్థానంలో మాధవ్ ను నియమించడం వెనుక బీసీ కార్డ్ ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన అనుబంధం ఉన్న బీసీ నేత అయిన మాధవ్ 1980-86 మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ, జనసేనతో పొత్తు బలోపేతం చేయడం, బీసీ ఓటర్లను ఆకర్షించడం కోసం మాధవ్ ను వ్యూహాత్మకంగా బీజేపీ హై కమాండ్ ఎంపిక చేసింది.

This post was last modified on June 30, 2025 1:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago