ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఏ నేతలకు దక్కబోతోందని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏపీలో మరోసారి దగ్గుబాటి పురంధేశ్వరికే పగ్గాలు అప్పగించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో చిన్నమ్మకే మరో చాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై కమాండ్ నియమించింది. ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు పేరును ఎంపిక చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రామచందర్ రావుకు ఈ పదవి దక్కడం విశేషం. ఈ పదవి ఆయనకు దక్కడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారట. ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కకుండా బీజేపీ సీనియర్ నాయకులు చెక్ పెట్టారట. బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన రామచందర్ రావుకు ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధాలున్నాయి. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు బ్రాహ్మణ సమాజానికి చెందిన రామచందర్ రావు సరైన వ్యక్తి అని బీజేపీ హై కమాండ్, ఆర్ఎస్ఎస్ పెద్దలు భావించారు.
ఇక, ఏపీ బీజేపీ చీఫ్ గా చిన్నమ్మ స్థానంలో మాధవ్ ను నియమించడం వెనుక బీసీ కార్డ్ ఉంది. ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం ఉన్న బీసీ నేత అయిన మాధవ్ 1980-86 మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ, జనసేనతో పొత్తు బలోపేతం చేయడం, బీసీ ఓటర్లను ఆకర్షించడం కోసం మాధవ్ ను వ్యూహాత్మకంగా బీజేపీ హై కమాండ్ ఎంపిక చేసింది.
This post was last modified on June 30, 2025 1:54 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…