ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఏ నేతలకు దక్కబోతోందని తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏపీలో మరోసారి దగ్గుబాటి పురంధేశ్వరికే పగ్గాలు అప్పగించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో చిన్నమ్మకే మరో చాన్స్ దక్కుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై కమాండ్ నియమించింది. ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు పేరును ఎంపిక చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రామచందర్ రావుకు ఈ పదవి దక్కడం విశేషం. ఈ పదవి ఆయనకు దక్కడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారట. ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కకుండా బీజేపీ సీనియర్ నాయకులు చెక్ పెట్టారట. బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన రామచందర్ రావుకు ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధాలున్నాయి. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు బ్రాహ్మణ సమాజానికి చెందిన రామచందర్ రావు సరైన వ్యక్తి అని బీజేపీ హై కమాండ్, ఆర్ఎస్ఎస్ పెద్దలు భావించారు.
ఇక, ఏపీ బీజేపీ చీఫ్ గా చిన్నమ్మ స్థానంలో మాధవ్ ను నియమించడం వెనుక బీసీ కార్డ్ ఉంది. ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం ఉన్న బీసీ నేత అయిన మాధవ్ 1980-86 మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ, జనసేనతో పొత్తు బలోపేతం చేయడం, బీసీ ఓటర్లను ఆకర్షించడం కోసం మాధవ్ ను వ్యూహాత్మకంగా బీజేపీ హై కమాండ్ ఎంపిక చేసింది.
This post was last modified on June 30, 2025 1:54 pm
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…