అల వైకుంఠపురములో తర్వాత తమన్ తోనే సంగీతం చేయించుకోవాలని అల్లు అర్జున్ అనుకున్నాడు. అయితే తనకి సూపర్ హిట్ ఆడియోస్ ఎన్నో ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ ని ఎందుకు మార్చాలని సుకుమార్ అందుకు ఒప్పుకోలేదు. అయితే దేవి ఇప్పుడు మునుపటి ఫామ్ లో లేడు. తాను ఆల్రెడీ చేసిన పాటలనే అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ కొడుతున్నాడు. పుష్పకి ఆలా చేస్తే మాత్రం కుదరదని అల్లు అర్జున్ అతనికి గట్టిగా చెప్పేసాడు.
పుష్ప పాటలు ఆర్య కంటే బాగుండాలని, అప్పట్లో ఎంత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చావో ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని బన్నీ తేల్చడంతో సుకుమార్ కంటే హీరోని ఇంప్రెస్ చేయడం మీద డీఎస్పీ ఫోకస్ పెట్టాడు. అల్లు అర్జున్ ని మెప్పించడం అంటే అతడిని ఒక్కడిని మెప్పిస్తే సరిపోదు. అతని టీం అంతటిని, గీత ఆర్ట్స్ బ్యాచ్ ని, బన్నీ కుటుంబ సభ్యులని కూడా అలరించాలి. అందరికి పాట వినిపించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాకే అల్లు అర్జున్ ఓకే చెప్తాడు.
లాక్ డౌన్ అయినా కూడా డీఎస్పీ ఇప్పుడు తన స్టూడియోలో పుష్ప పాటల కోసమే కసరత్తు చేస్తున్నాడు. మాములుగా సుకుమార్ సినిమాలకి అతనే అన్నీ ఓకే చేస్తాడు. కానీ ఈసారి హీరోదే డామినేషన్.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…